Saturday, February 20, 2021

                        షర్మిల(షేమ్ ) రాజకీయాలు స్టార్ట్ చేస్తుంది  

వారసత్వ వ్యహారాలకు (వారసత్వ రాజకీయాలు,రాజరిక వారసత్వాలు ,వారసత్వ ఉద్యోగాలు  వంటివి )తీవ్రంగా వ్యతిరేకించే రాజకియ్యా మేధావులు,మరి ఇప్పుడు జరుగుతుంది ఏమిటి ? వారసత్వ నాటకాలకు వత్తాసు  పలకటం విడ్డురంగా లేదా ? ప్రాంతాల వారీగా ,భాష ల వారీగా దేశాన్ని విచ్చల విడిగా విడగొట్టి వారి పబ్బం గడుపుకొంటున్న నీతి లేని నాయకులు ఉన్నన్ని రోజులు ప్రజల పై భౌతిక ,మానసిక దాడులు అను నిత్యం జరుగుతుంటాయని మనం గమనించాలి . 
వారసత్వాన్ని ఇష్ట పడే వారు , పూర్వం నుండి వస్తున్న వారసత్వ రాజరిక రాజ్యాన్ని ఎందుకు వ్యతిరేకించారు ? 
ఆంధ్రప్రదేశ్ లో అతి కిరాతంగా  కులాల పేరిట జరుగుతున్న భౌతిక దాడులు , వ్యక్తిగత రాజకీయా కక్షలతో ,ఉద్దేశిత పూర్వకంగా దాడులకు దిగుతూ ,ప్రజల మనోబావాలతో ,స్థిరాస్తులపై, దేవాలయాల పై, దాడులకు దిగుతూ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురిచేయ్యటం లేదా ? ఎక్కడో ఒక దేశంలో   పుట్టిన పరాయి మతం వాళ్ళు ,వీళ్ళు  కాదా ? 
ప్రజలు ఉన్నట్టుగా రాజకీయా నాయకులూ అమాయకులు కాదు కదా ? అయ్యో రెండు మార్లు సీఎం పదవికి పోటీచేసి ఓడిపోయి తినటానికి ,ఉండడానికి ఇల్లు లేక అతి దరిద్రానికి దగ్గరి బంధువై ఆఖరి బంధువై జీవకళ లేకుండా ఉన్నాడని ,జాలి తో ,దయతో ,మాజీ ముఖ్య మంత్రి కుమారుడు మరీను అంటూ ,ఓట్లేసి గెలిపిస్తే ??????
ఈ ముఖ్యమంత్రి పదవి మల్లి రాదు , రాబోదు అని అనుకోని చిల్లర రాజకీయాలకు పునాది రాళ్లు గట్టిగా ఉండాలని ,ఎక్కడ ,ఎంత దొరికితే అంతా దోచుకోండని తన అనుచరులకు వత్తాసు పలుకుతూ వెనుకాల ప్రజల ప్రాణాలకు గోతులు తొవ్వుతూ ఆనంద0గా రాజా భోగాలు అనుభవిస్తూ ప్రజల మాన ,ప్రాణాలపై పైశాచికంగా బ్రతుకు దెరువు గడుపుకుంటున్న ఒక పదవీ మదం పట్టిన దౌర్భాగ్యుడు (దౌర్భాగ్యులు ). 
అలాంటి ఖైదీ కి వాతారసత్వాని అందించడానికి అక్కడ అన్న,ఇక్కడ చెల్లెలు ప్రజలను భయ బ్రాంతులకు గురి చెయ్యాటానికి తెలంగాణలో తిష్ట వెయ్యాటానికి పావులు కదుపుతుంది . దానికి ఇక్కడి వారు సపోటా చెయ్యటం విడ్డురం మరి ??పూర్వ రాజకీయాలు ఏ పార్టీకి అయితే తన సపోట్ ఉంటాదో అదే పార్టీలో జీవితంలో మొత్తం దాన్లోనే ఉండేవారు ,మరి ఇప్పుడు ? ఉదయం పూట ఒక పార్టీలో ,సాయంత్రం పూట ఇంకో పార్టీలో వారికి కావాల్సింది పదవి ?,అది వారికి రాలేదంటే, ఎక్కడ తనకు అనుకూలంగా ఉంటుందో అక్కడ రెక్కలు కట్టుకొని మరి వాలుతారు మన రాజకీయా వారసులు ?
షర్మిల రాజకీయా ప్రస్తానం అన్న ఖైదీ నుండి మొదలయిందని చెప్పొచ్చు ? కాదా ? అయితే అన్న పాద యాత్ర మధ్యలో ఆగిపోవడంతో ,తాను దాన్ని ఈవిడ కొనసాగించారు అయితే ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా,షర్మిల ప్రవర్ధన ఉందంటూ వస్తున్న వార్తలు, పూర్తిగా తప్పుడు ప్రచారం అది , దాన్నికావాలని  పబ్లిసిటీ చేసుకుంటున్నది స్వతహాగా వారే,  కారణం ఆంధ్ర ముఖ్య మంత్రి కి ,మన సీఎం గారితో ఉన్న సంబంధాలని తెలిసి చెడకొట్టుకోవడం ఇష్టం లేక చేల్లెలిని రంగంలోకి దించటం జరిగింది ,దీనికి అన్న ,చెల్లెలికి మధ్య పోరు జరుగుతుందని ప్రజల్లో సానుభూతిని పొందాటానికి మాత్రమే ఈ నాటకం . 
అన్న సీఎం కాక ముందే లక్షల కోట్ల డబ్బులు ,ఆస్తులు బాగానే కూడబెట్టాడని అందరికి తెలిసిన విషయమే ? కానీ ఇప్పుడు చెల్లెలు అత్తారింటి పేరును కూడా కనీసం చెప్పుకొని షర్మిల ? వైస్ కూతురిగా రాజకీయాలను చెయ్యటానికి తెలంగాణలో పాగా వెయ్యటానికి పావులు కదుపుతుంది మరి ? అక్కడ సంపాదించిన ఆస్తులు సరిపోవని  బ్రదర్ అనిల్ , షర్మిల చెమటోర్చి కష్టపడటానికి పక్క రాష్టాలు కావలెను... మరి ! దీనికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాటానికి సదా సిద్ధంగా ఉండే అమ్మ , సీఎం లు అండగా ఉండగా భయమెందుకు కదా ? ఉన్న రాష్టాO  సరిపోవటం లేదని పక్క రాష్టాలకు గాలి సోకుతుంది జాగ్రత్త సుమీ ...... !
                                             జై హింద్