Tuesday, November 3, 2020

      ఓటర్ చేతిలో దేశ భవిషత్తు (త్తా )? నోటులోనా ? కోటర్  మందులోనా  ?


ఎలక్షన్ కాలమంటేనే అందరికి సంతోషం, ఆనందం కదా ? నోట్ల కట్టలు ,సారాయి ప్యాకెట్లు ,బీరుబాటిళ్ళు మరియు బిర్యానీ పొట్లాలు వీటితో పాటు కులాల ప్యాకేజీలు వంటి బంపర్ ఆఫర్స్ . పోటీదారునికి గెలుపు బాధ , కార్యకర్తలకు పంపాకాల లొల్లి ,గల్లీలీడర్ల కు వాటాల గొడవ , ఇవి అన్ని కాకుండా డబ్బులు పంపించిన వాడికి లెక్కల బాధ . 

దేశ భవిషత్తు ఓటర్ చేతిలో ఉందని ప్రపంచాలు ,దేశాలు గట్టి నమ్మకాలు గా ఉన్నాయి , అయితే నాయకుని ఎన్నిక ఎలా ఉండాలని అంటే మాత్రం పెద్ద ప్రశ్న (?)లాగ ఉంటుంది . ప్రజా నాయకుని ఎన్నిక ఇలా జరిగిన నాడు దేశ భవిషత్ మారుతుందని నా గట్టి నమ్మకం , ఎక్కడ నోట్ల కట్టలు , బంగారం , సారాయి ,బిర్యాని పొట్లాలు ఉండవో అక్కడ నిజమైన నాయకుడు ఉన్నట్టు గా ఋజువు .  

ఓటర్ ఎన్నడు క్లారిటీ వస్తుందో కానీ , క్లారిటీ వచ్చేంత వరకు బ్రతుకు జట్కా బండి మరకలతో , ప్యాచులతో కాలం గడ్డుగా గడపాల్సిందే ? నాయకులూ ఓట్లప్పుడే మన ఊరి దాకా , పొలం దాకా , ఇంటిదాకా , మన దాకా వస్తారని ఎప్పుడుతెలుసుకుంటారో ... ? , ఎలక్షన్స్ తర్వాతా మల్లి కనబడితే పాపం ?, మన ఊరిదాకా రానేరాడు ,వచ్చిన మన చోట ,మోట నాయకులూ ఎక్కడివరకు పోనివ్వరు , ఒక వేళా పోనిచ్చిన నాయకుడి గార్డ్స్ రానివ్వరు . మరి మన నాయకులూ ఇది అంత గమనించి కూడా చూసి చూడకుండా ఉండే మన బడా నాయకుడు (?) , అంతర్లీనంగా తనలో తాను గర్వాంగా ఎన్నికల నాడు మమ్మలిని మీ ఇంటివద్దకు ,పొలం వద్దకు రప్పించుకొని బతిలాడించుకొని , నోట్లకు నోట్లు ,బిర్యాని పొట్లాలు ,సారాయి పొట్లాలు తీసుకున్నాకనే మందులో,మత్తులో మాకు ఓట్లేస్తారా ? అని కసితో మన వంక జాలిగా చూస్తూ ఉంటాడు (?). కాదా ?

ఏ నాయకుడు  ప్రజలకి ప్రతిరోజు అందుబాటులో ఉంటాడో తాను నిజమైన ప్రజా నాయకుడు . మన నాయకులకు కార్లు ,ఏసీ బంగ్లాలు మరియు మనం నాయకుడిని వద్దకు వెళ్లాలంటే  అడ్డుకునే గార్డులను మనమే సమ కూర్చిపెడితే మరి ప్రజలను దగ్గరికి రానివ్వద్దుకదా ?కాదు కూడదు అంటే నాయకుని రక్షణ ముఖ్యం కదా ? అని ఎదురు ప్రశ్న మిగులుతుంది మనకి . 

రక్షణ విషయంలో మాత్రం నాయకులకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని మాత్రం మన ఆర్ధిక గణాంకాల వల్ల స్పష్టత వస్తుంది , గౌరవ మాజీనాయకుడు కోటశ్రీనివాస్ రావ్ గారి మాటల్లో ఏంటంటే ,తాను ఒక టివి కి  ఇచ్చిన ముఖ మూకీ సారాంశం,  మన మాజీ MLA బాబుమోహన్ గారు మంచి గొప్ప నటన నైపుణ్యం కల్గిన నటులు,వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది కూడా , అయితే మాజీ నాయకుడు కోట శ్రీనివాస రావు గారు ,బాబుమోహన్ రావు గారు ఎదురు పడినప్పుడు నాకు ఉన్నారంటే , నాకు  , ఇద్దరు గన్మెన్స్ అని గర్వాంగా చూపుకుంటూ హేళనగా చూసుకున్నారటా? అంటే ప్రాణ కాపలా దారులు ( రక్షక దళం ) ఒక గర్వానికి , హోదాకి పదవికి చిమ్నంగా వారికి అలవాటుగా , గుర్తింపుగా మారింది , ఇది మన రాజకీయా నాయకుల పద్ధతులు  . 

మరి రక్షణ ఎవ్వరికి అవసరం ఉంటుంది ,నాయకులకేనా ? (నక్షలైట్స్  మరియు ఉగ్రవాదుల వంటి వారితో నిరంతరం పోరాడుతూ ప్రాణాలకు తెగించి )రక్షణ వ్యవస్థలో పనిచేసిన పొలిసు వారికి ,సీబీసీఐడీ ,ఇంటర్ పోల్ ,అతి సూక్ష్మ ,సున్నిత రక్షణ( పాకిస్థాన్ ,చైనా వంటి ) వ్యవస్థలో దేశ భవిషత్తు కోసం ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా ప్రాణాలు వదిలిన వారికి ,ఉద్యోగస్తులకు ఎటువంటి భద్రత కల్పించాం,వారి కుటుంబాలని ఎలా రక్షిస్తున్నాం , ఎలా సమాజంలో వారికి ఉన్న గుర్తింపు ఎలా ఉంది ? అని మనం సమాలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ఆలోచన . లేదు గాంధీ వంటి శాంతికామకున్నికాపాడుకోలేక పోయాం ? మరి వీరి పరిస్థితి ఏంటానా ? దీనికి సమాధానం ఎక్కడికి నుండి రావాలి ? ఎప్పుడు రావాలి ?

అతి సాధారణ జన జీవనం ,ప్రజల మధ్య నిరంతరం ఉండే ప్రజా నాయకుని కోసం ఎప్పడికి ఎదురుచూపేనా ? ఎక్కడినుండి రావాలి ? ఎలా రావాలి ? ప్రజా నాయకుడు .?  

మావి గొప్ప దేశాలు అని చెప్పుకునే ఇతర దేశాలు అమెరికా వంటివి , వారి అధ్యక్ష ఎన్నికలకు పోటీచేసే నాయకులూ జీవిత కాలంలో, కేవలం ఒక సారి  మాత్రమే అధ్యక్ష పదవిని అనుభవించే చట్టం అక్కడ ఉంది ,అంటే తన జీవిత కాలంలో ఎప్పుడైనా  అధ్యక్ష పదవిని చేపట్టి, తన పదవి కాలం  ముగిసిన  తర్వాత ,తిరిగి అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చెయ్యరాదు అని వారి నిబంధన. మరి మనకు వద్దా ఈ నిబంధన ?

ఒకప్పుడు ఇతర దేశాల ప్రజల ( ఇంజనేర్లు ,డాక్టర్లు ,మేధావులు )మీద ,ఇతర దేశాల సంపద మీద ఆధార పడి ,ఇవ్వాళా గొప్ప దేశం అని  ప్రపంచ దేశాలను గర్వంతో చూసే అమెరికా ,ఇంగ్లాండ్ వంటి దేశాలు వాటి రక్షణ వరకు వచ్చేసరికి , ఇతర దేశాలమీద ఆంక్షలు పెట్టె స్థాయికి ఎదిగింది మరి ? ఇన్ని రోజులు లేని వీసా వంటి వాటిపైన ఆంక్షలు ఇప్పుడే ఎందుకు ? ఆర్ధిక మాంద్యం వల్ల , వారి రక్షణ కోసం ,ఇతర దేశ ప్రజల పై , వారి ఆర్ధిక స్థితి పై భారం మోపుతూ ..... ?

Friday, October 30, 2020

వారసత్వం  కాకూడదు, రాజకీయ్యం  ఎన్నటికీ  ? ఎప్పటికి 

రాజ్యాలు పోయాయి , రాజులూ పోయారు కానీ రాజకీయ్యం
లో వారసత్వం మాత్రం పోలేదు , కారణం ప్రజలా  ?, లేదా నాయకులా  ?
నాయకుల పుణ్యం అంటూ రాజకీయా వాగ్దానాల ? వాటిని పుష్టిగా తింటూ 
సోమరులుగా మారుతున్న మనమా ? ఎవరిది తప్పు . 
రాజుల కాలంలో బ్రతికిన అప్పటి వారు గొప్పవారా ? లేదా ఇప్పటి వారం 
గొప్పవారమా ? రాజుల కాలంలో ఉన్న ప్రజా పాలన ఎలా ఉండేది మరి ?,
వారి పాలనా విధానం ఎట్టిది ? ఎలా ? ఉండేది అది ?

పాలన పరంగా ప్రజల మధ్య కానీ , రాజ్యాల పాలన( రాజులు )  అధికారులు మధ్య కానీ కొన్ని ఆంక్షలు ఉండేవి ,కానీ వారి పాలన విధానం మాత్రం ప్రతి ఒక్కరు శారీరక శ్రమతో, కస్టపడి ,ఇష్టపడి రోజు పనిలో మునిగిపోయి , రాత్రికి ,పగలకి తేడా లేకుండా కష్టంతో కూడిన కూడును ,గుడ్డను సమకూర్చుకొని ఆనందంగా ఉండేవారు . ఇది నిత్యం జరిగే వారి జీవన విధానం . 
అయితే ఇప్పుడు మనకు మాత్రం కనీ , వినీ ఎరుగని రీతిలో ఉత్త పుణ్యానికి ,వివిధ రూపాలలో రకరకాలుగా మన వద్దకు వచ్చి చేరుతున్నాయి , వీటి తో మనం సోమరులుగా మారి , మందులకు ,విందులకు బానిసలుగా మారి , రాజకీయా వాదులకు , నాయకులకు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాం . 
మరి ఎవ్వరికి లాభం మరి ? ప్రజలకా ? నాయకులకా ? దేశానికా ? 
చైనా వల్ల కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో , ఈ సోమరి తనం వల్ల ప్రజల జీవితాలు కూడా అలాగే నాశనం అయ్యేఅవకాశం చాలా మెండుగా ఉంది . మరి దీని వల్ల లాభం ఎవ్వరికి , ప్రజలు సోమరులు అయితే వారికి ఎదురు ఉండదు , ఇది చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కంటే ప్రమాదమని గుర్తించక పోవటం చాలా బాధాకరం , దీని పై మేధావుల యొక్క వాదన ఏ మాత్రం లేక పోవటం ఇంకా బాధ కరం , కోపిష్టి కోపం వ్యక్త పరిస్తే నష్టం , కానీ మేధావుల మౌనం చాలా ప్రమాద కరం . దీనికి ఒక జింబావ్బే దేశం గొప్ప ఉదాహారణ . 
కాదంటారా !? 


Saturday, October 17, 2020

                  అతివృష్టి ,అనావృష్టి 

లోతట్టు ప్రాంతాలను ,కుంటలను ,చెరువులను  ఆక్రమించుకోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలకు దారితీస్తుందని తెలుసుకోండి  (?) , తెలుసుకొని మల్లి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడం వల్ల ఇంతటి నష్టం జరగదని గమనించండి . మరి ముక్యంగా  పరియవరణాన్ని రక్షించండి , అప్పుడు మాత్రమే ఇటువంటి అతివృష్టి , అనావృష్టిల  నుండి కాపాడుకోవడం మాత్రమే మిగిలింది మనకు . కనివిని ఎరుగని వర్షాల వల్ల  ప్రజల జన జీవనం అస్త వ్యస్తం అయిందనే  చెప్పాలి , విరివిగా కురుస్తున్న వర్షాల వల్ల సాధారణ ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారింది , ఇది ఎవ్వరి చేతులలో లేదని , ఉండదని అందరికి తెలిసినప్పటికీ  ఏదో ఒక పార్టీ పై నింద  మోపడం అందరికి అలవాటైన మాటలే , ఇక్కడ విషయం అదికాదు , ఇక్కడ వర్షం గురించి మన  సంభాషణ  . 
అయితే గౌర్నమెంట్ వారినో ,అక్కడ ఉన్న నాయకులనో , అందం వల్ల జరిగిన నష్టం తిరిగి వస్తుందా ? రాదు కాబట్టి ,ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం ? అన్నదే విషయం . 
ప్రతిపక్షాలు , ప్రజల పక్షాలు అంటూ వృధా కాలక్షేపాలు చేసే రాజకీయాలే కానీ , ఏ ఒక్కడు తన స్వంత ఖర్చుతో దానం చేసేవారు ,ఇచ్చే వారు తక్కువ , ఒకరి పై ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటమే తప్ప ఒరిగేది ,చేసేది ఏమి ఉండదనే చెప్పాలి . 
బ్రమ్మస్త్రం వంటి ఓటును , నోటుకు అమ్ముడు పోయేముందు లేని ఆలోచన ఇప్పుడు ఏమి లాభం ?అప్పుడు క్వాటర్ ,సారా ప్యాకెట్ ,బిర్యాని పొట్లం తప్ప ఇంకోటి మన కంటికి కనబడదు , వినబడదు . వినబడ్డ అప్పుడు ఉన్న పరిస్థితిలో పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టే , ఇప్పుడు ఈ పరిస్థికి కారణం కాదా ?
పట్టణంలోని నల్లాలను ,మురికి కాలువలను పట్టించుకోకుండా మనం ,ఇష్టపడి ,కస్టపడి తీసుకున్న స్థలంలో కానీ ,ఎవరో అమ్మిన వంపు ప్రాంతాలను కొని ,ఇప్పుడు ఇన్ని కష్టాల పాలుకావడం ఒక్క ఓటర్ కు మాత్రమే సాధ్యమని వారికి తెలుసు ?కాదా ?ఏమిటి ?. 
ప్రభుత్వంలో నే  ఉన్న MLA ,MP ల నియోజకంలోనే వర్షాల వల్ల నష్టం జరిగిందా ? వేరే ఎక్కడ జరగ లేదా ? మరి ఇంత రాజకీయాలా ? ప్రజా జీవనం పైన ?కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాలల్లో వర్షాల వల్ల నష్టం జరగ లేదా ?TRS పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతంలో మాత్రమే జరిగిందా ఈ నష్టం ? యాభై  సంవత్సరాలు పాలించిన పార్టీల మాటేమిటి  ? అంతేనా కాదా ? . 
ఇక్కడ జరిగింది ప్రజలకు నష్టం కాబట్టి , వారికి అన్నిపార్టీలు కలిసి ఎంత సహాయం చేద్దామని కాకుండా ,మీరేం చేసారని  వద నలకు దిగి , ప్రజల ముందు పాలనలో ఉన్న ప్రభుత్వాలని ఏండ్డకట్టడం కాదు కావాల్సింది ? ఇప్పుడు టైం కు ఇంత కూడు ,గుడ్డ మరియు నీడ మాత్రమే కావాలి మనకి . 
అతివృష్టి వల్ల కురిసిన వర్షాలకు  నష్ట పరిహారం కోసం , ఉండడానికి ఇంత ఇల్లు ,ఉంటె చాలనుకొనే మధ్య తరగతి మామూలు మనుషులం మనం . 

ఇదం జగత్తు . 

Monday, October 12, 2020

             పదవి వ్యామోహం? ఎవ్వరిది ?ఎప్పటిది ?

రాజకీయ్యంగా  ఎదిగిన వారికి  ,ఎప్పుడు ?,ఎక్కడ ? ఎన్నడూ ?అన్యాయంగా  మోసపోయిన 

దాఖలాలు లేవు ,రాలేవు కూడా . ఎందుకంటే వారికి ఎప్పుడు ,మనం ఎప్పటికి వారి వెంట ఉంటాం అని వారి నమ్మకం ,ఆలాగే వారిని మన బుజాల పై మోస్తూ ఉంటామని వారి బలమైన నమ్మకం కూడా . కానీ  మనకు మాత్రం వారు నమ్మకంగా ఉంటారని గట్టినమ్మకం లేదనే చెప్పాలి ఇక్కడ . 

ఎందుకంటే వారికి ఎంతసేపు వారి పదవిని కాపాడుకోవాడ0లోనే  వారి ఆమూల్యయమైన కాలం గడిచిపోతుంది . వారికి ఎంతసేపు వారికి రావాల్సిన , కావాల్సిన  సౌకర్యాల గురించి  మాత్రమే ఎప్పుడు , వారి దృష్ట్రీ చూస్తూ  ఉంటుంది. సాధారణ మనిషి బ్రతికినట్టుగా దాఖలాలు లేవు కాబట్టి ? వారికీ సకల సౌకర్యాలతో , రాజభోగాలు అలవాటు చేస్తిమి కదా  మనమే (?). 

తాను ఉన్నపార్టీలో కనుక సీటు రాలేదంటే , వెంటనే ఇంకో పార్టీలో చేరిపోవటం ఒక పరిపాటి అయిపొయింది . మరి ఆ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటని మాత్రం అడగొద్దు . కారణం వారి , వారి  ఆర్ధిక పరిస్థితి పైన వారి భవిషత్ ఆధార పడి  ఉంటుంది కాబట్టి  , అది 

అందరికి తెలిసిన విషయమే కదా ? అంటారా .!

అయినా వారికి కావాల్సింది పదవి కానీ ,ప్రజలా ? కాదు ముమ్మాటికీ కాదని చెప్పొచ్చు . 

వారికి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యాలకు ,మరియు  వారు దానిని ఒక దర్పంగా ,ఒక హోదాగా  , వారి మదిలో బలంగా నాటుకు పోతింది కాబట్టి ? వారు దానిలోంచి అంత తొందరగా బయటకు రాలేరు కాబట్టి , వారికి వెంటనే పదవి కావలి కాబట్టి , ఇతర పార్టీల వైపు తొంగి చూస్తూ ఉంటారు . అధికారంలో ఉన్నప్పుడు , మంది ,మార్బలం ,వాహనాలు వాటి వెంటా ,సెక్యూరిటీ గార్డులే  , కాకుండా ఫోన్ బిల్లు ,కారు బిల్లు ,ఇంటి బిల్లు ,వాటర్ బిల్లు ,ఇంటి మెటనెన్స్ కోసం ఖర్చులకు నగతుగా వారికి చెల్లించటం  మరియు ఆదికారికంగా విదేశీ ప్రయాణాలు ఎక్సట్రా ... ?

ప్రాంతాల వారీగా విడిది చెయ్యటానికి అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు , పార్ల మెంట్లో కానీ , అసెంబ్లీలో కానీ వారికి క్వాలిటీ ఫుడ్ , క్వాలిటీ టీ , క్వాలిటీ ఆఫీస్ రూమ్స్  ఇస్తే , వారు వెలగపెట్టేది , కాల పెట్టేది , అక్కడ ఉన్న మైకులు , బెంచీలు మరియు టేబుల్స్ . 

ఒక సభను నడిపించటం కోసం గంటకు కనీసం లక్ష ల  రూపాయల కొద్దీ ఖర్చు చేస్తుంటే మనం? , మనం పన్నులు కట్టుకుంటూ పోతే , వీరు వెలగపెట్టేది ఇది ! 

రాజకీయాన్ని ఒక చదువు గా , ఉద్యోగానికి ఎన్ని షరతులు ఉంటాయో ,మిలటరీలో ఎన్ని కస్టాలు ఉంటాయో ,ఒక IAS ,IPS కు ఎన్ని కండిషన్స్  ఉంటాయో ,అన్ని నియమాలు ఉన్న నాడు కానీ , ఉద్యోగానికి విధించే నియమాలు అన్ని, వారి పూర్వ చరిత్ర మరియు ముందు చరిత్ర  ను ( ఉద్యోగార్తి కి  క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉన్నాయా ? అని తెలుసుకొని వారికి ఉత్తమమైన ప్రవర్తన ఉంటేనే  ( certifay ) ఉద్యోగానికి అర్హుడుగా ప్రకటిస్తారు కాబట్టి , 

రాజకీయా నాయకులకు కూడా పైవి అన్నిషరతులు వర్తిస్తాయి అని లోగో పెట్టాలని కోరుకుందాం . 

జై   భారత్ మాత ! 

Friday, October 9, 2020

       అవసరమా  ?  ఈ  L R S   ( Layout Regularisation Scheme ) లు  కాదా  ?    

మధ్య తరగతి వారు ,దిగువ తరగతి వారు రూపాయి, రూపాయి కూడపెట్టి , కొన్ని సంవత్సరాలు  మొత్తం కష్ట పడి కూడపెట్టిన ప్రతి పైసా ను ,ఒక్క దగ్గరికి తెచ్చుకొని ,స్వంత ఇంటి కలను నెరవేర్చుకుందామనే ఆలోచనతో మున్సిపల్ అనుమతి లేకుండా ఉన్న ప్లాట్స్ ను అమాయకంగా  కొనుగోలు చేసుకున్న వారికి ఇది(LRS ) ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు . అయితే ఇక్కడ విషయం అది కాదు . 
DTCP అనుమతి లేకున్నా ఇంటి స్థలాలను కొన్నటువంటి వారు మోసపోయినట్టి వారే , ఆలాగే వారు కొన్నటువంటి ప్లాట్ వద్దకు నీటి ,మరియు మురుగు కాలువలు ఆదికారికంగా ఉండాలంటే, వారు ఆదికారికంగా చెల్లుపాటు అయినా ప్లాట్ లను కొనాలి కాబట్టి , జరిగిన తప్పుకు ,దిద్దుపాటు చేసుకోవటానికి ఈ(LRS ) అవకాశం మంచిది,సైరైనది కూడా . 
మరి ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు , మరియు లీగల్ గా కూడా సపోటుగా ఉంటుంది . 
ఇక్కడ తప్పు ఎవ్వరిది రిజిస్టర్ దా  ? ప్రభుత్వాలదా ? లేక ప్రజలదా ? అందరిని తప్పుతోవ పట్టించిన రియల్ వ్యాపారులదా ? ఎవ్వరిది తప్పు ? 
ఈ తప్పులకు నష్ట పరిహారం ఎవ్వరు కట్టాలి  మరి ? ఎందుకు కట్టాలి మరి ? రియల్ వ్యాపారుల ? గౌర్నమెంట్ ఉద్యోగస్తులా ? కాదు , కాదు (?). ముమ్మాటికి సాధారణ ప్రజలదే కదా ? వినబడిందా ?                                                                  

Wednesday, September 30, 2020

          ఆరోగ్యాబీమా  మరియు జీవిత బీమాలు  అవసరమా ?


సాధారణ జన జీవనంలో ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా ఉండితీరాల్సిందే అనేది నేటి తరానికి బాగా తెలిసిన విషయమే ,కానీ దానిని ఎంత వరకు ఉపయోగించుకుంటాము అనేది ప్రశ్న ? స్వంత సంపాదన ఎప్పుడైతే మొదలైందో, స్వంత నిర్ణయాలు కూడా అప్పుడే మొదలయ్యాయి . ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్ద మాత్రమే నిర్ణయాలు తీసుకునే వారు ,వారి నిర్ణయాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేవి ,అయితే ఇప్పుడు ఉన్న పరిస్థిల ప్రకారం ఇప్పుడే బాగుంది అనే వాదన కూడా లేకపోలేదు . కానీ వివిధ కుటుంబలా నుండి వచ్చిన వ్యక్థితిత్వాలు రకరకాలుగా ఉంటాయని , అందు వల్లే  ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిందని ఇప్పటి వాదన .

అది ఏమైనా, ఇక్కడ బీమా గురించి వివరణ కాబట్టి ,బీమా విషయంను మాత్రేమే పరిశీలింద్దాం . జీవిత బీమా అనేది ఒక వ్యక్తి కి మాత్రమే సంబంధం ఉండదు, తన కుటుంబానికి కూడా సంబంధం ఉంటుంది  ,ఎలాగంటే కుటుంబ పెద్ద జీవిత బీమా తీసుకుంటే ,అనుకోకుండా ప్రాణ నష్టం జరిగితే , తన కుటుంబానికి ఆర్ధిక స్వాలంబన చేకూరాలి కాబట్టి ,ఇక్కడ బీమా వినియోగ దారునికి తన కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక  దిక్కుగా ఉంటుంది ,కానీ కుటుంబ పెద్ద లేని లోటును మాత్రం తీర్చలేనిది. ఇవ్వాళా  చాణక్యుడు చెప్పినట్టుగా  "మానవ సంబంధాలు ,ఆర్థిక సంబంధాలు అని గుర్థించకనే గుర్తించుకోవాలి మరి . 

డబ్బుకు లోకం దాసోహం అనే నానుడి నిజం కాబట్టి ,జీవిత బీమా వినియోగదారుడు ఉన్న ,లేకపోయినా తన కుటుంబ బాధ్యతను నెరవేరుస్తుంది . జీవిత బీమా దారుడు ఒక చందా దారుడిగా ఉంటాడు ,ఒక వేళా జీవిత బీమా కాల పరిమితి మించితే , తన అంగీకారం ప్రకారం పాలసీ ముగిస్తే ,తాను చెల్లించిన వాయిదాల మొత్తం మరియు దానికి గాను వచ్చిన బోనస్ తో కలిపి మొత్తం వినియోగదారునికి చెల్లిస్తుంది ,అలా కానీ పక్షంలో తన నామీనికి పాలసీ మొత్తం మరియు అనుకోకుండా వచ్చే ఆక్సిడెంటల్ బెనిఫిట్ తో కలిపి నామీనికి చెల్లిస్తుంది ,జీవిత బీమా కాలపరిమితి దాటితేనే లేదా ఆక్సిడెంటల్గా జరిగే మరిణామాలకు మాత్రమే చెల్లిస్తుంది . కానీ ఆరోగ్యబీమా మాత్రం కొంచం ముందుగా ఉంటుంది . 

వినియోగా దారుడు చెల్లించిన డబ్బులకు ఆరోగ్య బీమా లో తనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ,దవాఖాన ఖర్చులు మొత్తం బీమా కంపిని చెల్లిస్తుంది ,ఇది తన హక్కు కూడా అయితే ,తన కుటుంబ పెద్దగా తానే అనారోగ్యాంగా ఉన్నప్పుడు ,ఆరోగ్యానికి అయ్యే ఖర్చులు ఎక్కడినించి రావాలి మరి , తన కుటుంబ సభ్యులు తన ఆరోగ్య విషయంలో కంగారు పడి ,ఒక రకమైన వేదనలో ఉంటారు కాబాట్టి ,అటువంటి క్లిష్ట పారస్థులల్లో వారికి అండగా ఉండేది కేవలం ఒక్క ఆరోగ్య బీమా మాత్రమే . అయితే ఇక్కడ తనకి మాత్రమే కాదు తన కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ ను ఆరోగ్య బీమా కల్పిస్తుంది ,దీనికి గాను వివిధ రకాల బీమా సంస్థలు రకరకాలుగా పాలసీల రూపంలో వినియోగ దారునికి అందుబాటులో ఉన్నాయి . 

కానీ ముక్యంగా మనం ఆరోగ్యాంగా ఉన్నపుడు తీసుకుంటేనే ప్రీమియం మరియు కాలం కలిసి వస్తుంది ,అంటే అనారోగ్యానికి గురి అయితే కొంచం ప్రీమియం పెరుగుతుంది ,మరియు పాలసీ అందుబాటులోకి రావటానికి వెయిటింగ్ పీరియడ్ సమయం రెండు ,లేదా మూడు సంవత్సరాల కాలం ఉంటుంది ,కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్య బీమా కలిగిఉంటే ఎంతోకొంత డబ్బులు సంపాదించినవాడు అవుతాడు ,లేని పక్షంలో రాబొయ్యే కాలంలో ఖర్చుల పాలు కాకుండా తప్పదు . 

నష్టం వస్తుంది అనితెలిసి ఏ ఒక్క వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడు ,అలాగే బీమా సంస్థలు కూడా అలాగే ఉంటాయి కదా !

జీవిత బీమా వల్ల వినియోగ దారుడు ఉన్నచో పాలసీ టర్మ్ ముగిసిన వెంటనే బీమా మొత్తం మరియు తాను చెల్లించిన వాయిదాలకు బోనస్ కలిపి చెల్లిస్తాయి ,లేదా బీమా వినియోగా దారుడు లేని పక్షంలో తన కుటుంబ లోని నామీనికి మొత్తం డబ్బులు చెల్లిస్తుంది . అయితే వినియోగ దారుడు ఉన్న ,లేక పోయిన బీమా మొత్తం తిరిగి వారికి గాని ,నామిని కి గాని చెల్లిస్తుంది బీమా సంస్థ .అయితే కొందరు వ్యక్తులు తానే లేనప్పుడు డబ్బులు ఉంటె ఎంత ?లేకపోతే ఎంత ? అని వితండా వాదానికి దారితీస్తారు . కానీ తన కుటుంబం ఎంత ఆర్థిక సమస్యల పాలు అవుతారు అని ఊహించలేక పోతారు . అదే ఆరోగ్య బీమా ఆలా ఉండదు ,తాను ఉండాగానే తన యొక్క అనారోగ్యానికి కావాలసిన డబ్బులు హాస్పిటల్ కి నేరుగా చెల్లిస్తుంది , ఇది తాను స్వయంగా చూడగలుగుతాడు కూడా .   





 

Tuesday, September 29, 2020

                       సినిమా వారి సి(విచి )త్రాలు 

మన భారతావని అరువై నాలుగు కళలకు పుట్టినిల్లు ,అందులో ముక్యంగా  నటన  కూడా  ఒక  కళ ,
అన్ని కళలు ఒకటైతే ,సినిమాలోని నటన కళా  గొప్పగా  కలకలాడుతుంది . దానికి  నటన  చేసిన నటులు కావచ్చు,    రాచేయతలు  కావచ్చు . 
ఇక్కడ కళల  రకాల గురించి  కాదు , వాటికి  జరుగుతున్న అన్యాయం  గురించి ,వాటి మీద ఆధార పడి  ప్రాణాలు  గుప్పిట్లో పెట్టుకొని  జీవిస్తున్న కళా కారుల జీవితాల  మీద అసంతృప్తి  వెళ్లగక్కుతున్నాను  . అసంతృప్తి కి  గల కారణం  స్వార్థం తో  నిండిన  కొందరు  నటుల గురుంచి , ఇక్కడ ప్రస్తావించ  దలిచాను . వారు ముక్యంగా  గొప్ప నటులుగా చలామని అవుతున్న నటులు ,వారి  పేర్లు చెప్పాల్సిన అవసరం  లేదని  అనుకుంటున్నాను ,వారి పేర్లు మీకు బాగా  తెలుసును కూడా ,అయితే  అరవై నాలుగు కళలో  ఒక సినీ నటన  మాత్రమే ఎందుకు  ఇంత  ముఖ్య కళ  గా  చలామణి  లోకి వచ్చింది ? పాత రోజుల్లో సినిమా  వేసే శాలలు  అంతగా లేవని చెప్పాలి ,మరి ఇప్పుడు ప్రతి పట్టణంలో కనీసం రెండేసి సినిమా లు వేసే శాలలు కోకొల్లలు .రానురాను నాటకాలకు విలువలు తగ్గి ,దూరదర్శిణిలు ,చలన చిత్రాల ఆదరణ  క్రమంగా పెరుగుతూ వచ్చింది . అవి ఈ నాడు ప్రజల తల రాతలు రాసే స్థాయికి వచ్చి చేరాయి ,అయితే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు వేరని చెప్పాలి . మరి తప్పు ఎక్కడ జరింగింది  ? మనుషులలో క్రమంగా డబ్బు పట్ల మోజు పెరుగుతూ  వచ్చి ,వారిని కొన్ని వేయిల కోట్లకు అధిపతులను చేసింది ,క్రమంగా సినిమా  ఒక వ్యాపారం  ,ఒక గొప్ప  హోదా  అని భావిచిన చోట (చిన్న పాటి )నాయకులూ ,సినిమా  సంస్థను వారి కనుసందుల్లో శాసించటం జరిగింది . 
ఈ రోజు  సినీ వీక్షకుల మీద ఆధార పడే నటులు కూడా ,మనకు నాయకులుగా (సీఎం)మారి ,నేడు పలానా  నాయకుడు పీఎం ,సీఎం అవుతారు ,అని సేల వివ్వటం కూడా జరుగుతుంది . కొన్నికోట్ల లక్షల రూపాయలు మన నుండి లాభం పొంది ,నేడు మన దేశం కు వ్యతిరేకంగా ,దేశ భవిశ్యత్తుకు వీ గాథం కలిగించే స్థాయికి వారు వెళ్లగలిగారు అంటే ఎవ్వరిది తప్పు ? వారు తీసిన సినిమాల కోసం ,డబ్బులు ,కాలం ను వృధా చేసుకుంటూ ,కేవలం సినిమా టికెట్ కోసం,వారి పటా లకు  దండలు ,వెయ్యటానికి వెళ్లి ఎంత మంది వారి ప్రాణాలు పోగొట్టుకోలేదు? (తొపులాటలో  ,కరెంటు  షాకు ). 
ఇంత చేస్తే ఈ దేశంలో ఉండాలంటే భయంగా ఉంది ,ఇక్కడ పుట్టడం వృధా అని సొల్లుమాటలు చెప్పుతున్నారు ఈ సినిమా ఆర్టిస్టులు ?ఎందుకు ?వీరా  మన దేశ గౌరవాన్ని కాపాడేది ?
దేశంలో అనుకోకుండా జరిగే ఉపద్రవాలకు ఏ ఒక్కడు స్పందించడు ?కోట్లకు కోట్లు మాత్రం జమ చేసుకొని ఇతర దేశాలకు విరాళాలుగా  (పాకిస్తాను వంటి దేశానికి )  సమర్పించు కుంటున్నారు . వారిలో ముక్యంగా బాలిహూడ్ నటులు కావటం  విశేషం ?
దేశానికి ,దేశ ప్రజల కష్టానికి చలించి కొన్ని కోట్ల రు పాయాలను  విరాళాలుగా ఇచ్చి ,వారి దాతృత్వాన్ని సాటుకున్నారు ,వారిలో  అక్షయ్ కుమార్ ,సోనూసూద్ అని  గొప్పగా చెప్పా వచ్చు . 
నటన లో ఎంతో గొప్ప నటులు ,వారి శేష జీవితాన్ని ఎన్నో కష్టాలతో ,ఆర్ధిక ఇబ్బందులతో  చివరికి కూడు ,గుడ్డ లేకుండా మరణించిన వారు కోకొల్లలు ,అందుకు మీకు తెలిసిన ఉదాహరణ " మహా నటి "గా  గొప్ప పేరు తెచ్చుకున్న సావిత్రి ,రేలంగి ,రాజనాల  వంటి ఎంతో మంది ఉన్నారు ,వారికి అశ్రునివాలులతో ...... కన్నీటి ....... బిందువులు .   

Friday, September 18, 2020

                        విభజన రాష్ట్రాలకా ? ప్రజలకా ?

రాష్ట్రాల విభజన ఎందుకు జరిగింది ? దానికి గల కారణాలు ఏమిటి ? ఫలితం ఏంటి ? అది ఎవరికీ లాభం ? రాజులనుండి ,నాయకుల నుండి ,ప్రజా పరిపాలన అతి సులువుగా సాగాలని మామూలు ప్రజానీకానికి అతి చేరువులో ఉండాలని  ,అప్పటి రాజులకు గాని ,నాయకులకు గాని అనుకోని ఉండ వచ్చు . అయితే ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఉండ కూడదని ,ప్రజా పరిపాలన జన రంజకంగా సాగాలని ,పూర్వం గొప్ప రాజులుగా పేరుపొందిన మహా రాజుల పరిపాలన లాగ ఉంటుందని ,ఉండాలని ఆశ పడ్డారు ,కానీ అది ఒక దేశ భవిషత్తును తిరగ రాస్తోందని అనుకోలేక పోయారు .

సరే ఏది ఏమిజరిగిన ,విభజన జరిగింది . అయితే విభజనకు ముందు ,విభజన తర్వాత కూడా వారి చేతులలో దేశ భవిషత్తు మల్లి ,నాయకుల చేతులలోకి తిరిగి వెళ్లి  పోయింది . మన దేశ భవిషత్తు ఎంతో గొప్పగా ఉండుందని కలలు కన్నా,ఎందరో మహా వీరుల ప్రాణ త్యాగాలు వృధా కాకుండా ఉంటె చాలని కోరుకుందాం !ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన స్వాతంత్ర భారతం ఇలా ఉందా ? అని వారి యొక్క ఆత్మా గోషా చాల కఠినంగా గోషిస్తుందని ,ఉంటుందని నాకు బాధాగా ఉంది ,ఇలా రాయాలంటేనే మనస్సుకు అదోలా ఉంది ,కానీ రాయకుండా ఉండ లేక పోతున్నాను .....  ?

భాష ప్రతిపాదికన జరిగిన రాష్ట్రాల విభజన మల్లి ,తిరిగి ప్రాంతీయా రాష్ట్రాలుగా ఎందుకు విభజించడం జరుగుంతుంది ?దానికి కారణం ఎవరు ?ఎందుకు ?ఎవరికీ లాభం ?

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న నాయకులే ,ఇప్పుడు ఉన్న ఈ నాయకులే ప్రజా నాయకులుగా ఉన్నారు మరి?ఇప్పుడు ఎక్కడికి పోదాం మరి ? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న ఈ నాయకులూ ఇప్పుడు మంత్రులు ,కేంద్ర మంత్రులు కూడాను ,అయితే ఇక్కడ ,ఇప్పుడు ఎవ్వరిది తప్పు ? ఎందుకు తప్పు ?అప్పుడు ఉన్న పరిస్థితి లో అసెంబ్లీలో కానీ ,పార్లమెంట్లో కానీ ,వీరు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు రాబట్టలేదు ?అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందించ లేదు ?అప్పుడు పోరాట పటిమా లేదా ? లేక మనకెందుకులే అని నిబ్బరంగా ఉన్నారా ఏమిటి ?మనం మాత్రం సంతోషంగా ఉన్నాం కాబట్టి ,ప్రజలు ఎట్లా పోతే ఏమిటి ?

నాయకులలో ఇప్పుడు అతీ సాధారణ జన జీవనం గడుపుతున్న నాయకులూ  ఎంత మంది ? ఎందుకు సాధారణ జన జీవనం గడప లేకపోతున్నారు ? దానికి గల కారణాలు ఏమిటి ? ఒక్క సారి ఎన్నికలల్లో పోటీచేసిన వ్యక్తి ,మళ్ళి ,మల్లి ఎందుకు పోటీకి సిద్ద పడుతున్నాడు ? మల్లి ,మల్లి రాజకీయా పార్టీలను మారుతున్నాడు ?ఎంత దూరం పోయిన తిరిగి మాత్రం ,పదవి కోసం ఎదో ఒకటి చేసి తిరిగి ,అదికార నాయకునిగా , అంగు ,ఆర్భాటంతో , ప్రజలా ? మమ్మలిని శాసించేది ?అని గర్వ0గా గల్లా ఎగిరేసుకుంటూ , నాకు ఓటు వెయ్యని వాడికి ఉంటుంది చూడు ? అన్నట్టుగా బలంగా ,బలహీనున్నీ  టార్గెట్ చేస్తూ కాలం గడుపుతూ , మాకా కాలపరిమితి ? కాదు అది మీకు ?మాత్రమే !...... 

మీరు ఎట్లాగూ మారరూ ,కనీసం మేమైనా మారుతాము . 

 


   

Thursday, September 17, 2020

రాజు(సీఎం)లు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయా? 


రాజాకియ్య చదరంగంలో బలి అయ్యేది మామూలు వారు ,మధ్య తరగతి వారు

మాత్రమే ,కానీ బడా బాబులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు . రాజకీయా నాయకుల ఆర్ధిక వ్యస్థ పై ఎటువంటి వత్తిడి ఉండదు ,పలానా రాజకీయా వేత్త రాజాదాని మార్పు వల్లా సర్వం కోలిపోయిన సంఘటన చాలా తక్కువ . కారణం రాజధానుల మార్పు ,జిల్లాల మార్పు వంటివి వారికే ముందు తెలుస్తుంది కాబట్టి . 

సుమారు గా లక్ష కోట్ల రూపాయలు  కొత్తగా ఏర్పాటు అయ్యే  రాజధానుల ఖర్చు అనుకుంటే , ఈ డబ్బులు గత ప్రభుత్వాలు కేటాయించడం వల్లా రాష్ట్ర ,మరియు దేశ్ ప్రజల  పైన ఎంత ఆర్ధిక భారం పడుతుంది ? అయిన ప్రజానీకానికి అవసరం కాబట్టి వాటిని బరించినప్పటికీ ,వారి ఇంటిని , నమ్ముకున్నభూమి తల్లిని కోల్పోయి వారి పిల్లల  భవిషత్తు బాగుండాలని కోరుకుంటే ?. 

స్వప్రజాయనమే ముఖ్యం అంటూ ,తాజదానిని మారుస్తాం అంటూ ,ప్రజల మనోభావాలను దెబ్బతియ్యటమే కాకుండా ,రాజధానుల దీక్షను హేళనగా చూడటం ఎంతవరకు సబబు ?.  అమరావతి వంటి రాజధాని పై ఇన్వెస్ట్ మెంట్  పెట్టినటువంటి ప్రభుత్వ ,ప్రైవేట్ యాజమాన్యాల భవిషత్తు ఎక్కడ ?

దాధాపుగా లక్ష కోట్ల రూపాయల ఖర్చును స్వతహాగా సీఎం గారు భరిస్తారా ?లేక ప్రజల పై భారం వేస్తారా ? జవాబు ఎవ్వరు చెప్పాలి ? వంద రోజుల దీక్ష, జగన్ గారి కంటికి కనపడుట లేదా ,కనపడ్డా ? కనపడనట్టుగా నటిస్తున్నారా ? 

దాదాపుగా లక్ష కోట్ల రూపాయల నష్టం ఎలా సమకూర్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ,ఇది ప్రజల సొమ్ము కాదా ? కేవలం సీఎం యొక్క సొమ్మా ?ఎంత మంది కష్టం వృధా అవుతుంది మరి?ఎన్నికోట్ల రూపాయలు వృధా అవుతాయి . అయితే కానీ ,నాయకుల సొత్తు కాదు కదా ? అందుకే వారసత్వ రాజకీయాలకు ,ప్రజా సొమ్మును దిగ మింగే ఈ స్వార్థ నాయకులను ఇంటికి పంపించే కాలం రావాలి ,వారికి పూర్తిగా రాజకీయా జీవితానికి అంతిమా చర్మ గీతం పాడాలి !

సీఎం లు మామూలు జన జీవనం గడిపే వరకు ఇంతే !

Thursday, September 10, 2020

           
          దారి తప్పిన(రాజకీయా)ఉదారత 

దేశం కోసం వారి ప్రాణాలు కూడా లెక్క చెయ్యని రాజులు ,రాణులు  మరియు సాధారణ వ్యక్తులు  ఎంతో మంది వారి ప్రాణాల త్యాగ ఫలమే ,ఈ నాటి స్వాతంత్రం  . దానికి ఒక అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ,సుభాష్ చంద్ర బోస్ వంటి ఎంతో మంది పుణ్య పురుషుల త్యాగబలం  
వల్లా ,ఇది సాధ్యం అయింది. కానీ వీరి యొక్క వారసులు రాజకీయాలలో ఎవ్వరు లేరు ,ఎందుకు ?
వారసులు లేకనా? రాలేకనా? వారికీ రాజకీయాల పై  ఇష్టం లేక మాత్రమే ..... 
ఇక్కడే మొదటి తప్పు జరిగింది ,అది  ఎందరో త్యాగ ధనుల ప్రాణాల ,కష్టాల ఫలం వృధా అవ్వటం మొదలవడం మొదలు పెట్టింది , వారే వారసత్వ రాజకీయాలకు పునాది రాళ్లు ,వేసుంటే  మన దేశం ఇంకోరకంగా ఉండేదేమో ? గాంధీలకు  ,నెహ్రు లకు తేడా ఉందని తెలుసుకొనే వరకు  ఇది ఇలానే కొనసాగుతుంది .   
 కారణం విదేశి వ్యక్తల చేతులలో మన రాజ్యాంగాన్ని,దేశాన్ని ఉంచటమే ఓక పెద్ద తప్పిదం. 
దానికి వివిధ కారణాలు అయినప్పటికీ ,మూల్యం ప్రజల0 చెల్లించుకుంటున్నాం,కానీ ఇప్పటికి మనం ఇంకా పాత తరం రాజకీయాలను పట్టుకొని వేలాడుతుంటే మన బ్రతుకులు ఇంతే , 
అయినా సరే మనం ఇంతే అయితే మన బ్రతుకులతో పాటు , మన పిల్లల బ్రతుకులు కూడా 
ఇంతే ఉంటుంది . అయితే ఇక్కడ ఎప్పుడు రాజకీయాలను విమర్శించుకుంటూ పోతే లాభం 
లేదు అని నా నమ్మకం , మరి మార్పు ఎక్కడ  రావాలి , మనలో మార్పు ముందుగా రావాలి ,
దానికి గాను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి .అవి  

కష్టాన్ని నమ్ముకోవాలి , నిబ్బరంగా ఉండాలి , నాయకున్ని మన మధ్యలోని వారిని  
ఎన్నుకోవాలి, మన నాయకునికి పేదవాని కష్టాలు అన్ని తెలిసి ,అనుభవించిన వాడు కావలి ,
తనకి కారు ,బంగ్లా  వంటి వ్యామోహంలు  ఉండ కూడదు,కానీ కష్టం విలువ తెలిసి ఉండాలి 
మనలో ఒకడు , మన వాడు అవుతాడు కానీ , మనం ఇక్కడ ,తాను పట్నం వాసి అయితే  మనకు లాభం ఏమి ఉండదు . పట్టణానికి మనకు ఎంత దూరమో ,తనకి మనకి కూడా అంతే దూరం పెరుగుతుంది   కదా !

వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి మరి ,అయితే ఒక మెట్టు మనం ముందుకు పోయినట్టుగా 
ఉంటుంది ,తన తాతలు ఏదో చేసారని మనం ఊడిగం చెయ్యాల్సిన అవసరం లేదు ,  ఉదాహరణకు : ఈ మధ్య సర్పంచ్ పదవులకు ,వారి కారిక్రమాలకు వారి వారి భర్తలు హాజరు అవడం జరుగుతుందని ,ప్రజా గ్రామా సభలో వారి వారి భర్తలను ప్రజలను నిలతీయ్యటం జరిగింది , అయితే ఇది ఒకందుకు మంచిదే కానీ , ఈ నిలతీయ్యటం అనేది ఒక రోజు  అంటూ   ఆగిపోకూడదు ,ఇది ఇలా క్రింది స్థాయి నుండి పై స్థాయి కి విస్తరించాలి , ప్రతి ప్రజా నాయకుడు 
అందరికి అందుబాటులో ఉండి తీరాలి , ఇది కదా న్యాయం . 

ప్రజా నాయకులూ సాధారణ జన జీవనం గడపలేరా , లేక పోతే ఎందుకు జరిగింది ఆలా ఏమి 
చేసారని ఇంత గట్టి భద్రత , దానికి అయ్యే ఖర్చు ఎవ్వరు భరించాలి మరి ? ఎంత భరించాలి మనం ? ప్రతి రాజకీయా నాయకుడికి శత్రువులు ఉంటారా ? ఉంటె దేనివల్ల వారికి శత్రువులు 
ఉన్నారని ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అయితే  మాజీ పాత తరం  ప్రజా  నాయకులకు ఇప్పటికి కనీస సౌకర్యాలు లేవని  ఎంత మందికి తెలిసు ? కనీసం స్వంత ఇల్లు ,కారు  వంటివి  వారికి ఇప్పటికి లేవని తెలుసుకోవాలి ?   వారు కేవలం వారికి వచ్చే పెన్షన్ మీదనే 
ఆధార పడి జీవిస్తున్నారు ! వారిని చూసి నేర్చుకోరా ? మరి మన నాయకులూ !
అయ్యో ఎన్నిమార్లు పోటీచేసిన ఓటమి చెందాడని ,మనం(జాలితో ) ఓటు వేస్తే వారు మన నెత్తిన 
కూర్చుంటారు , సాధారణ వ్యక్తి ఉన్నజాలి,కరుణ  ప్రభుత్వ ఉద్యోగికి గాని , ప్రజా నాయకునికి గాని 
ఉండవని గమనించాలి , మనం ఓటు వేసి గెలిచినా నాయకుడు మనల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని మన ఆలోచన ,కానీ తాను మన నెత్తిన కూర్చుంటాడని మనకు తెలియదు కదా !
తెలిసిన , మారక పోతాడా ? అని ఆశా ? కానీ ఎండమావి ఎప్పడికి ,చల్లటి నీటిని ఇవ్వలేదని తెలుసుకో లేక పోతున్నాం కదా !