Friday, October 30, 2020

వారసత్వం  కాకూడదు, రాజకీయ్యం  ఎన్నటికీ  ? ఎప్పటికి 

రాజ్యాలు పోయాయి , రాజులూ పోయారు కానీ రాజకీయ్యం
లో వారసత్వం మాత్రం పోలేదు , కారణం ప్రజలా  ?, లేదా నాయకులా  ?
నాయకుల పుణ్యం అంటూ రాజకీయా వాగ్దానాల ? వాటిని పుష్టిగా తింటూ 
సోమరులుగా మారుతున్న మనమా ? ఎవరిది తప్పు . 
రాజుల కాలంలో బ్రతికిన అప్పటి వారు గొప్పవారా ? లేదా ఇప్పటి వారం 
గొప్పవారమా ? రాజుల కాలంలో ఉన్న ప్రజా పాలన ఎలా ఉండేది మరి ?,
వారి పాలనా విధానం ఎట్టిది ? ఎలా ? ఉండేది అది ?

పాలన పరంగా ప్రజల మధ్య కానీ , రాజ్యాల పాలన( రాజులు )  అధికారులు మధ్య కానీ కొన్ని ఆంక్షలు ఉండేవి ,కానీ వారి పాలన విధానం మాత్రం ప్రతి ఒక్కరు శారీరక శ్రమతో, కస్టపడి ,ఇష్టపడి రోజు పనిలో మునిగిపోయి , రాత్రికి ,పగలకి తేడా లేకుండా కష్టంతో కూడిన కూడును ,గుడ్డను సమకూర్చుకొని ఆనందంగా ఉండేవారు . ఇది నిత్యం జరిగే వారి జీవన విధానం . 
అయితే ఇప్పుడు మనకు మాత్రం కనీ , వినీ ఎరుగని రీతిలో ఉత్త పుణ్యానికి ,వివిధ రూపాలలో రకరకాలుగా మన వద్దకు వచ్చి చేరుతున్నాయి , వీటి తో మనం సోమరులుగా మారి , మందులకు ,విందులకు బానిసలుగా మారి , రాజకీయా వాదులకు , నాయకులకు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాం . 
మరి ఎవ్వరికి లాభం మరి ? ప్రజలకా ? నాయకులకా ? దేశానికా ? 
చైనా వల్ల కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో , ఈ సోమరి తనం వల్ల ప్రజల జీవితాలు కూడా అలాగే నాశనం అయ్యేఅవకాశం చాలా మెండుగా ఉంది . మరి దీని వల్ల లాభం ఎవ్వరికి , ప్రజలు సోమరులు అయితే వారికి ఎదురు ఉండదు , ఇది చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కంటే ప్రమాదమని గుర్తించక పోవటం చాలా బాధాకరం , దీని పై మేధావుల యొక్క వాదన ఏ మాత్రం లేక పోవటం ఇంకా బాధ కరం , కోపిష్టి కోపం వ్యక్త పరిస్తే నష్టం , కానీ మేధావుల మౌనం చాలా ప్రమాద కరం . దీనికి ఒక జింబావ్బే దేశం గొప్ప ఉదాహారణ . 
కాదంటారా !? 


Saturday, October 17, 2020

                  అతివృష్టి ,అనావృష్టి 

లోతట్టు ప్రాంతాలను ,కుంటలను ,చెరువులను  ఆక్రమించుకోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలకు దారితీస్తుందని తెలుసుకోండి  (?) , తెలుసుకొని మల్లి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడం వల్ల ఇంతటి నష్టం జరగదని గమనించండి . మరి ముక్యంగా  పరియవరణాన్ని రక్షించండి , అప్పుడు మాత్రమే ఇటువంటి అతివృష్టి , అనావృష్టిల  నుండి కాపాడుకోవడం మాత్రమే మిగిలింది మనకు . కనివిని ఎరుగని వర్షాల వల్ల  ప్రజల జన జీవనం అస్త వ్యస్తం అయిందనే  చెప్పాలి , విరివిగా కురుస్తున్న వర్షాల వల్ల సాధారణ ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారింది , ఇది ఎవ్వరి చేతులలో లేదని , ఉండదని అందరికి తెలిసినప్పటికీ  ఏదో ఒక పార్టీ పై నింద  మోపడం అందరికి అలవాటైన మాటలే , ఇక్కడ విషయం అదికాదు , ఇక్కడ వర్షం గురించి మన  సంభాషణ  . 
అయితే గౌర్నమెంట్ వారినో ,అక్కడ ఉన్న నాయకులనో , అందం వల్ల జరిగిన నష్టం తిరిగి వస్తుందా ? రాదు కాబట్టి ,ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం ? అన్నదే విషయం . 
ప్రతిపక్షాలు , ప్రజల పక్షాలు అంటూ వృధా కాలక్షేపాలు చేసే రాజకీయాలే కానీ , ఏ ఒక్కడు తన స్వంత ఖర్చుతో దానం చేసేవారు ,ఇచ్చే వారు తక్కువ , ఒకరి పై ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటమే తప్ప ఒరిగేది ,చేసేది ఏమి ఉండదనే చెప్పాలి . 
బ్రమ్మస్త్రం వంటి ఓటును , నోటుకు అమ్ముడు పోయేముందు లేని ఆలోచన ఇప్పుడు ఏమి లాభం ?అప్పుడు క్వాటర్ ,సారా ప్యాకెట్ ,బిర్యాని పొట్లం తప్ప ఇంకోటి మన కంటికి కనబడదు , వినబడదు . వినబడ్డ అప్పుడు ఉన్న పరిస్థితిలో పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టే , ఇప్పుడు ఈ పరిస్థికి కారణం కాదా ?
పట్టణంలోని నల్లాలను ,మురికి కాలువలను పట్టించుకోకుండా మనం ,ఇష్టపడి ,కస్టపడి తీసుకున్న స్థలంలో కానీ ,ఎవరో అమ్మిన వంపు ప్రాంతాలను కొని ,ఇప్పుడు ఇన్ని కష్టాల పాలుకావడం ఒక్క ఓటర్ కు మాత్రమే సాధ్యమని వారికి తెలుసు ?కాదా ?ఏమిటి ?. 
ప్రభుత్వంలో నే  ఉన్న MLA ,MP ల నియోజకంలోనే వర్షాల వల్ల నష్టం జరిగిందా ? వేరే ఎక్కడ జరగ లేదా ? మరి ఇంత రాజకీయాలా ? ప్రజా జీవనం పైన ?కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాలల్లో వర్షాల వల్ల నష్టం జరగ లేదా ?TRS పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతంలో మాత్రమే జరిగిందా ఈ నష్టం ? యాభై  సంవత్సరాలు పాలించిన పార్టీల మాటేమిటి  ? అంతేనా కాదా ? . 
ఇక్కడ జరిగింది ప్రజలకు నష్టం కాబట్టి , వారికి అన్నిపార్టీలు కలిసి ఎంత సహాయం చేద్దామని కాకుండా ,మీరేం చేసారని  వద నలకు దిగి , ప్రజల ముందు పాలనలో ఉన్న ప్రభుత్వాలని ఏండ్డకట్టడం కాదు కావాల్సింది ? ఇప్పుడు టైం కు ఇంత కూడు ,గుడ్డ మరియు నీడ మాత్రమే కావాలి మనకి . 
అతివృష్టి వల్ల కురిసిన వర్షాలకు  నష్ట పరిహారం కోసం , ఉండడానికి ఇంత ఇల్లు ,ఉంటె చాలనుకొనే మధ్య తరగతి మామూలు మనుషులం మనం . 

ఇదం జగత్తు . 

Monday, October 12, 2020

             పదవి వ్యామోహం? ఎవ్వరిది ?ఎప్పటిది ?

రాజకీయ్యంగా  ఎదిగిన వారికి  ,ఎప్పుడు ?,ఎక్కడ ? ఎన్నడూ ?అన్యాయంగా  మోసపోయిన 

దాఖలాలు లేవు ,రాలేవు కూడా . ఎందుకంటే వారికి ఎప్పుడు ,మనం ఎప్పటికి వారి వెంట ఉంటాం అని వారి నమ్మకం ,ఆలాగే వారిని మన బుజాల పై మోస్తూ ఉంటామని వారి బలమైన నమ్మకం కూడా . కానీ  మనకు మాత్రం వారు నమ్మకంగా ఉంటారని గట్టినమ్మకం లేదనే చెప్పాలి ఇక్కడ . 

ఎందుకంటే వారికి ఎంతసేపు వారి పదవిని కాపాడుకోవాడ0లోనే  వారి ఆమూల్యయమైన కాలం గడిచిపోతుంది . వారికి ఎంతసేపు వారికి రావాల్సిన , కావాల్సిన  సౌకర్యాల గురించి  మాత్రమే ఎప్పుడు , వారి దృష్ట్రీ చూస్తూ  ఉంటుంది. సాధారణ మనిషి బ్రతికినట్టుగా దాఖలాలు లేవు కాబట్టి ? వారికీ సకల సౌకర్యాలతో , రాజభోగాలు అలవాటు చేస్తిమి కదా  మనమే (?). 

తాను ఉన్నపార్టీలో కనుక సీటు రాలేదంటే , వెంటనే ఇంకో పార్టీలో చేరిపోవటం ఒక పరిపాటి అయిపొయింది . మరి ఆ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటని మాత్రం అడగొద్దు . కారణం వారి , వారి  ఆర్ధిక పరిస్థితి పైన వారి భవిషత్ ఆధార పడి  ఉంటుంది కాబట్టి  , అది 

అందరికి తెలిసిన విషయమే కదా ? అంటారా .!

అయినా వారికి కావాల్సింది పదవి కానీ ,ప్రజలా ? కాదు ముమ్మాటికీ కాదని చెప్పొచ్చు . 

వారికి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యాలకు ,మరియు  వారు దానిని ఒక దర్పంగా ,ఒక హోదాగా  , వారి మదిలో బలంగా నాటుకు పోతింది కాబట్టి ? వారు దానిలోంచి అంత తొందరగా బయటకు రాలేరు కాబట్టి , వారికి వెంటనే పదవి కావలి కాబట్టి , ఇతర పార్టీల వైపు తొంగి చూస్తూ ఉంటారు . అధికారంలో ఉన్నప్పుడు , మంది ,మార్బలం ,వాహనాలు వాటి వెంటా ,సెక్యూరిటీ గార్డులే  , కాకుండా ఫోన్ బిల్లు ,కారు బిల్లు ,ఇంటి బిల్లు ,వాటర్ బిల్లు ,ఇంటి మెటనెన్స్ కోసం ఖర్చులకు నగతుగా వారికి చెల్లించటం  మరియు ఆదికారికంగా విదేశీ ప్రయాణాలు ఎక్సట్రా ... ?

ప్రాంతాల వారీగా విడిది చెయ్యటానికి అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు , పార్ల మెంట్లో కానీ , అసెంబ్లీలో కానీ వారికి క్వాలిటీ ఫుడ్ , క్వాలిటీ టీ , క్వాలిటీ ఆఫీస్ రూమ్స్  ఇస్తే , వారు వెలగపెట్టేది , కాల పెట్టేది , అక్కడ ఉన్న మైకులు , బెంచీలు మరియు టేబుల్స్ . 

ఒక సభను నడిపించటం కోసం గంటకు కనీసం లక్ష ల  రూపాయల కొద్దీ ఖర్చు చేస్తుంటే మనం? , మనం పన్నులు కట్టుకుంటూ పోతే , వీరు వెలగపెట్టేది ఇది ! 

రాజకీయాన్ని ఒక చదువు గా , ఉద్యోగానికి ఎన్ని షరతులు ఉంటాయో ,మిలటరీలో ఎన్ని కస్టాలు ఉంటాయో ,ఒక IAS ,IPS కు ఎన్ని కండిషన్స్  ఉంటాయో ,అన్ని నియమాలు ఉన్న నాడు కానీ , ఉద్యోగానికి విధించే నియమాలు అన్ని, వారి పూర్వ చరిత్ర మరియు ముందు చరిత్ర  ను ( ఉద్యోగార్తి కి  క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉన్నాయా ? అని తెలుసుకొని వారికి ఉత్తమమైన ప్రవర్తన ఉంటేనే  ( certifay ) ఉద్యోగానికి అర్హుడుగా ప్రకటిస్తారు కాబట్టి , 

రాజకీయా నాయకులకు కూడా పైవి అన్నిషరతులు వర్తిస్తాయి అని లోగో పెట్టాలని కోరుకుందాం . 

జై   భారత్ మాత ! 

Friday, October 9, 2020

       అవసరమా  ?  ఈ  L R S   ( Layout Regularisation Scheme ) లు  కాదా  ?    

మధ్య తరగతి వారు ,దిగువ తరగతి వారు రూపాయి, రూపాయి కూడపెట్టి , కొన్ని సంవత్సరాలు  మొత్తం కష్ట పడి కూడపెట్టిన ప్రతి పైసా ను ,ఒక్క దగ్గరికి తెచ్చుకొని ,స్వంత ఇంటి కలను నెరవేర్చుకుందామనే ఆలోచనతో మున్సిపల్ అనుమతి లేకుండా ఉన్న ప్లాట్స్ ను అమాయకంగా  కొనుగోలు చేసుకున్న వారికి ఇది(LRS ) ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు . అయితే ఇక్కడ విషయం అది కాదు . 
DTCP అనుమతి లేకున్నా ఇంటి స్థలాలను కొన్నటువంటి వారు మోసపోయినట్టి వారే , ఆలాగే వారు కొన్నటువంటి ప్లాట్ వద్దకు నీటి ,మరియు మురుగు కాలువలు ఆదికారికంగా ఉండాలంటే, వారు ఆదికారికంగా చెల్లుపాటు అయినా ప్లాట్ లను కొనాలి కాబట్టి , జరిగిన తప్పుకు ,దిద్దుపాటు చేసుకోవటానికి ఈ(LRS ) అవకాశం మంచిది,సైరైనది కూడా . 
మరి ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు , మరియు లీగల్ గా కూడా సపోటుగా ఉంటుంది . 
ఇక్కడ తప్పు ఎవ్వరిది రిజిస్టర్ దా  ? ప్రభుత్వాలదా ? లేక ప్రజలదా ? అందరిని తప్పుతోవ పట్టించిన రియల్ వ్యాపారులదా ? ఎవ్వరిది తప్పు ? 
ఈ తప్పులకు నష్ట పరిహారం ఎవ్వరు కట్టాలి  మరి ? ఎందుకు కట్టాలి మరి ? రియల్ వ్యాపారుల ? గౌర్నమెంట్ ఉద్యోగస్తులా ? కాదు , కాదు (?). ముమ్మాటికి సాధారణ ప్రజలదే కదా ? వినబడిందా ?