Wednesday, September 30, 2020

          ఆరోగ్యాబీమా  మరియు జీవిత బీమాలు  అవసరమా ?


సాధారణ జన జీవనంలో ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా ఉండితీరాల్సిందే అనేది నేటి తరానికి బాగా తెలిసిన విషయమే ,కానీ దానిని ఎంత వరకు ఉపయోగించుకుంటాము అనేది ప్రశ్న ? స్వంత సంపాదన ఎప్పుడైతే మొదలైందో, స్వంత నిర్ణయాలు కూడా అప్పుడే మొదలయ్యాయి . ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్ద మాత్రమే నిర్ణయాలు తీసుకునే వారు ,వారి నిర్ణయాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేవి ,అయితే ఇప్పుడు ఉన్న పరిస్థిల ప్రకారం ఇప్పుడే బాగుంది అనే వాదన కూడా లేకపోలేదు . కానీ వివిధ కుటుంబలా నుండి వచ్చిన వ్యక్థితిత్వాలు రకరకాలుగా ఉంటాయని , అందు వల్లే  ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిందని ఇప్పటి వాదన .

అది ఏమైనా, ఇక్కడ బీమా గురించి వివరణ కాబట్టి ,బీమా విషయంను మాత్రేమే పరిశీలింద్దాం . జీవిత బీమా అనేది ఒక వ్యక్తి కి మాత్రమే సంబంధం ఉండదు, తన కుటుంబానికి కూడా సంబంధం ఉంటుంది  ,ఎలాగంటే కుటుంబ పెద్ద జీవిత బీమా తీసుకుంటే ,అనుకోకుండా ప్రాణ నష్టం జరిగితే , తన కుటుంబానికి ఆర్ధిక స్వాలంబన చేకూరాలి కాబట్టి ,ఇక్కడ బీమా వినియోగ దారునికి తన కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక  దిక్కుగా ఉంటుంది ,కానీ కుటుంబ పెద్ద లేని లోటును మాత్రం తీర్చలేనిది. ఇవ్వాళా  చాణక్యుడు చెప్పినట్టుగా  "మానవ సంబంధాలు ,ఆర్థిక సంబంధాలు అని గుర్థించకనే గుర్తించుకోవాలి మరి . 

డబ్బుకు లోకం దాసోహం అనే నానుడి నిజం కాబట్టి ,జీవిత బీమా వినియోగదారుడు ఉన్న ,లేకపోయినా తన కుటుంబ బాధ్యతను నెరవేరుస్తుంది . జీవిత బీమా దారుడు ఒక చందా దారుడిగా ఉంటాడు ,ఒక వేళా జీవిత బీమా కాల పరిమితి మించితే , తన అంగీకారం ప్రకారం పాలసీ ముగిస్తే ,తాను చెల్లించిన వాయిదాల మొత్తం మరియు దానికి గాను వచ్చిన బోనస్ తో కలిపి మొత్తం వినియోగదారునికి చెల్లిస్తుంది ,అలా కానీ పక్షంలో తన నామీనికి పాలసీ మొత్తం మరియు అనుకోకుండా వచ్చే ఆక్సిడెంటల్ బెనిఫిట్ తో కలిపి నామీనికి చెల్లిస్తుంది ,జీవిత బీమా కాలపరిమితి దాటితేనే లేదా ఆక్సిడెంటల్గా జరిగే మరిణామాలకు మాత్రమే చెల్లిస్తుంది . కానీ ఆరోగ్యబీమా మాత్రం కొంచం ముందుగా ఉంటుంది . 

వినియోగా దారుడు చెల్లించిన డబ్బులకు ఆరోగ్య బీమా లో తనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ,దవాఖాన ఖర్చులు మొత్తం బీమా కంపిని చెల్లిస్తుంది ,ఇది తన హక్కు కూడా అయితే ,తన కుటుంబ పెద్దగా తానే అనారోగ్యాంగా ఉన్నప్పుడు ,ఆరోగ్యానికి అయ్యే ఖర్చులు ఎక్కడినించి రావాలి మరి , తన కుటుంబ సభ్యులు తన ఆరోగ్య విషయంలో కంగారు పడి ,ఒక రకమైన వేదనలో ఉంటారు కాబాట్టి ,అటువంటి క్లిష్ట పారస్థులల్లో వారికి అండగా ఉండేది కేవలం ఒక్క ఆరోగ్య బీమా మాత్రమే . అయితే ఇక్కడ తనకి మాత్రమే కాదు తన కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ ను ఆరోగ్య బీమా కల్పిస్తుంది ,దీనికి గాను వివిధ రకాల బీమా సంస్థలు రకరకాలుగా పాలసీల రూపంలో వినియోగ దారునికి అందుబాటులో ఉన్నాయి . 

కానీ ముక్యంగా మనం ఆరోగ్యాంగా ఉన్నపుడు తీసుకుంటేనే ప్రీమియం మరియు కాలం కలిసి వస్తుంది ,అంటే అనారోగ్యానికి గురి అయితే కొంచం ప్రీమియం పెరుగుతుంది ,మరియు పాలసీ అందుబాటులోకి రావటానికి వెయిటింగ్ పీరియడ్ సమయం రెండు ,లేదా మూడు సంవత్సరాల కాలం ఉంటుంది ,కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్య బీమా కలిగిఉంటే ఎంతోకొంత డబ్బులు సంపాదించినవాడు అవుతాడు ,లేని పక్షంలో రాబొయ్యే కాలంలో ఖర్చుల పాలు కాకుండా తప్పదు . 

నష్టం వస్తుంది అనితెలిసి ఏ ఒక్క వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడు ,అలాగే బీమా సంస్థలు కూడా అలాగే ఉంటాయి కదా !

జీవిత బీమా వల్ల వినియోగ దారుడు ఉన్నచో పాలసీ టర్మ్ ముగిసిన వెంటనే బీమా మొత్తం మరియు తాను చెల్లించిన వాయిదాలకు బోనస్ కలిపి చెల్లిస్తాయి ,లేదా బీమా వినియోగా దారుడు లేని పక్షంలో తన కుటుంబ లోని నామీనికి మొత్తం డబ్బులు చెల్లిస్తుంది . అయితే వినియోగ దారుడు ఉన్న ,లేక పోయిన బీమా మొత్తం తిరిగి వారికి గాని ,నామిని కి గాని చెల్లిస్తుంది బీమా సంస్థ .అయితే కొందరు వ్యక్తులు తానే లేనప్పుడు డబ్బులు ఉంటె ఎంత ?లేకపోతే ఎంత ? అని వితండా వాదానికి దారితీస్తారు . కానీ తన కుటుంబం ఎంత ఆర్థిక సమస్యల పాలు అవుతారు అని ఊహించలేక పోతారు . అదే ఆరోగ్య బీమా ఆలా ఉండదు ,తాను ఉండాగానే తన యొక్క అనారోగ్యానికి కావాలసిన డబ్బులు హాస్పిటల్ కి నేరుగా చెల్లిస్తుంది , ఇది తాను స్వయంగా చూడగలుగుతాడు కూడా .   





 

Tuesday, September 29, 2020

                       సినిమా వారి సి(విచి )త్రాలు 

మన భారతావని అరువై నాలుగు కళలకు పుట్టినిల్లు ,అందులో ముక్యంగా  నటన  కూడా  ఒక  కళ ,
అన్ని కళలు ఒకటైతే ,సినిమాలోని నటన కళా  గొప్పగా  కలకలాడుతుంది . దానికి  నటన  చేసిన నటులు కావచ్చు,    రాచేయతలు  కావచ్చు . 
ఇక్కడ కళల  రకాల గురించి  కాదు , వాటికి  జరుగుతున్న అన్యాయం  గురించి ,వాటి మీద ఆధార పడి  ప్రాణాలు  గుప్పిట్లో పెట్టుకొని  జీవిస్తున్న కళా కారుల జీవితాల  మీద అసంతృప్తి  వెళ్లగక్కుతున్నాను  . అసంతృప్తి కి  గల కారణం  స్వార్థం తో  నిండిన  కొందరు  నటుల గురుంచి , ఇక్కడ ప్రస్తావించ  దలిచాను . వారు ముక్యంగా  గొప్ప నటులుగా చలామని అవుతున్న నటులు ,వారి  పేర్లు చెప్పాల్సిన అవసరం  లేదని  అనుకుంటున్నాను ,వారి పేర్లు మీకు బాగా  తెలుసును కూడా ,అయితే  అరవై నాలుగు కళలో  ఒక సినీ నటన  మాత్రమే ఎందుకు  ఇంత  ముఖ్య కళ  గా  చలామణి  లోకి వచ్చింది ? పాత రోజుల్లో సినిమా  వేసే శాలలు  అంతగా లేవని చెప్పాలి ,మరి ఇప్పుడు ప్రతి పట్టణంలో కనీసం రెండేసి సినిమా లు వేసే శాలలు కోకొల్లలు .రానురాను నాటకాలకు విలువలు తగ్గి ,దూరదర్శిణిలు ,చలన చిత్రాల ఆదరణ  క్రమంగా పెరుగుతూ వచ్చింది . అవి ఈ నాడు ప్రజల తల రాతలు రాసే స్థాయికి వచ్చి చేరాయి ,అయితే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు వేరని చెప్పాలి . మరి తప్పు ఎక్కడ జరింగింది  ? మనుషులలో క్రమంగా డబ్బు పట్ల మోజు పెరుగుతూ  వచ్చి ,వారిని కొన్ని వేయిల కోట్లకు అధిపతులను చేసింది ,క్రమంగా సినిమా  ఒక వ్యాపారం  ,ఒక గొప్ప  హోదా  అని భావిచిన చోట (చిన్న పాటి )నాయకులూ ,సినిమా  సంస్థను వారి కనుసందుల్లో శాసించటం జరిగింది . 
ఈ రోజు  సినీ వీక్షకుల మీద ఆధార పడే నటులు కూడా ,మనకు నాయకులుగా (సీఎం)మారి ,నేడు పలానా  నాయకుడు పీఎం ,సీఎం అవుతారు ,అని సేల వివ్వటం కూడా జరుగుతుంది . కొన్నికోట్ల లక్షల రూపాయలు మన నుండి లాభం పొంది ,నేడు మన దేశం కు వ్యతిరేకంగా ,దేశ భవిశ్యత్తుకు వీ గాథం కలిగించే స్థాయికి వారు వెళ్లగలిగారు అంటే ఎవ్వరిది తప్పు ? వారు తీసిన సినిమాల కోసం ,డబ్బులు ,కాలం ను వృధా చేసుకుంటూ ,కేవలం సినిమా టికెట్ కోసం,వారి పటా లకు  దండలు ,వెయ్యటానికి వెళ్లి ఎంత మంది వారి ప్రాణాలు పోగొట్టుకోలేదు? (తొపులాటలో  ,కరెంటు  షాకు ). 
ఇంత చేస్తే ఈ దేశంలో ఉండాలంటే భయంగా ఉంది ,ఇక్కడ పుట్టడం వృధా అని సొల్లుమాటలు చెప్పుతున్నారు ఈ సినిమా ఆర్టిస్టులు ?ఎందుకు ?వీరా  మన దేశ గౌరవాన్ని కాపాడేది ?
దేశంలో అనుకోకుండా జరిగే ఉపద్రవాలకు ఏ ఒక్కడు స్పందించడు ?కోట్లకు కోట్లు మాత్రం జమ చేసుకొని ఇతర దేశాలకు విరాళాలుగా  (పాకిస్తాను వంటి దేశానికి )  సమర్పించు కుంటున్నారు . వారిలో ముక్యంగా బాలిహూడ్ నటులు కావటం  విశేషం ?
దేశానికి ,దేశ ప్రజల కష్టానికి చలించి కొన్ని కోట్ల రు పాయాలను  విరాళాలుగా ఇచ్చి ,వారి దాతృత్వాన్ని సాటుకున్నారు ,వారిలో  అక్షయ్ కుమార్ ,సోనూసూద్ అని  గొప్పగా చెప్పా వచ్చు . 
నటన లో ఎంతో గొప్ప నటులు ,వారి శేష జీవితాన్ని ఎన్నో కష్టాలతో ,ఆర్ధిక ఇబ్బందులతో  చివరికి కూడు ,గుడ్డ లేకుండా మరణించిన వారు కోకొల్లలు ,అందుకు మీకు తెలిసిన ఉదాహరణ " మహా నటి "గా  గొప్ప పేరు తెచ్చుకున్న సావిత్రి ,రేలంగి ,రాజనాల  వంటి ఎంతో మంది ఉన్నారు ,వారికి అశ్రునివాలులతో ...... కన్నీటి ....... బిందువులు .   

Friday, September 18, 2020

                        విభజన రాష్ట్రాలకా ? ప్రజలకా ?

రాష్ట్రాల విభజన ఎందుకు జరిగింది ? దానికి గల కారణాలు ఏమిటి ? ఫలితం ఏంటి ? అది ఎవరికీ లాభం ? రాజులనుండి ,నాయకుల నుండి ,ప్రజా పరిపాలన అతి సులువుగా సాగాలని మామూలు ప్రజానీకానికి అతి చేరువులో ఉండాలని  ,అప్పటి రాజులకు గాని ,నాయకులకు గాని అనుకోని ఉండ వచ్చు . అయితే ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఉండ కూడదని ,ప్రజా పరిపాలన జన రంజకంగా సాగాలని ,పూర్వం గొప్ప రాజులుగా పేరుపొందిన మహా రాజుల పరిపాలన లాగ ఉంటుందని ,ఉండాలని ఆశ పడ్డారు ,కానీ అది ఒక దేశ భవిషత్తును తిరగ రాస్తోందని అనుకోలేక పోయారు .

సరే ఏది ఏమిజరిగిన ,విభజన జరిగింది . అయితే విభజనకు ముందు ,విభజన తర్వాత కూడా వారి చేతులలో దేశ భవిషత్తు మల్లి ,నాయకుల చేతులలోకి తిరిగి వెళ్లి  పోయింది . మన దేశ భవిషత్తు ఎంతో గొప్పగా ఉండుందని కలలు కన్నా,ఎందరో మహా వీరుల ప్రాణ త్యాగాలు వృధా కాకుండా ఉంటె చాలని కోరుకుందాం !ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన స్వాతంత్ర భారతం ఇలా ఉందా ? అని వారి యొక్క ఆత్మా గోషా చాల కఠినంగా గోషిస్తుందని ,ఉంటుందని నాకు బాధాగా ఉంది ,ఇలా రాయాలంటేనే మనస్సుకు అదోలా ఉంది ,కానీ రాయకుండా ఉండ లేక పోతున్నాను .....  ?

భాష ప్రతిపాదికన జరిగిన రాష్ట్రాల విభజన మల్లి ,తిరిగి ప్రాంతీయా రాష్ట్రాలుగా ఎందుకు విభజించడం జరుగుంతుంది ?దానికి కారణం ఎవరు ?ఎందుకు ?ఎవరికీ లాభం ?

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న నాయకులే ,ఇప్పుడు ఉన్న ఈ నాయకులే ప్రజా నాయకులుగా ఉన్నారు మరి?ఇప్పుడు ఎక్కడికి పోదాం మరి ? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న ఈ నాయకులూ ఇప్పుడు మంత్రులు ,కేంద్ర మంత్రులు కూడాను ,అయితే ఇక్కడ ,ఇప్పుడు ఎవ్వరిది తప్పు ? ఎందుకు తప్పు ?అప్పుడు ఉన్న పరిస్థితి లో అసెంబ్లీలో కానీ ,పార్లమెంట్లో కానీ ,వీరు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు రాబట్టలేదు ?అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందించ లేదు ?అప్పుడు పోరాట పటిమా లేదా ? లేక మనకెందుకులే అని నిబ్బరంగా ఉన్నారా ఏమిటి ?మనం మాత్రం సంతోషంగా ఉన్నాం కాబట్టి ,ప్రజలు ఎట్లా పోతే ఏమిటి ?

నాయకులలో ఇప్పుడు అతీ సాధారణ జన జీవనం గడుపుతున్న నాయకులూ  ఎంత మంది ? ఎందుకు సాధారణ జన జీవనం గడప లేకపోతున్నారు ? దానికి గల కారణాలు ఏమిటి ? ఒక్క సారి ఎన్నికలల్లో పోటీచేసిన వ్యక్తి ,మళ్ళి ,మల్లి ఎందుకు పోటీకి సిద్ద పడుతున్నాడు ? మల్లి ,మల్లి రాజకీయా పార్టీలను మారుతున్నాడు ?ఎంత దూరం పోయిన తిరిగి మాత్రం ,పదవి కోసం ఎదో ఒకటి చేసి తిరిగి ,అదికార నాయకునిగా , అంగు ,ఆర్భాటంతో , ప్రజలా ? మమ్మలిని శాసించేది ?అని గర్వ0గా గల్లా ఎగిరేసుకుంటూ , నాకు ఓటు వెయ్యని వాడికి ఉంటుంది చూడు ? అన్నట్టుగా బలంగా ,బలహీనున్నీ  టార్గెట్ చేస్తూ కాలం గడుపుతూ , మాకా కాలపరిమితి ? కాదు అది మీకు ?మాత్రమే !...... 

మీరు ఎట్లాగూ మారరూ ,కనీసం మేమైనా మారుతాము . 

 


   

Thursday, September 17, 2020

రాజు(సీఎం)లు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయా? 


రాజాకియ్య చదరంగంలో బలి అయ్యేది మామూలు వారు ,మధ్య తరగతి వారు

మాత్రమే ,కానీ బడా బాబులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు . రాజకీయా నాయకుల ఆర్ధిక వ్యస్థ పై ఎటువంటి వత్తిడి ఉండదు ,పలానా రాజకీయా వేత్త రాజాదాని మార్పు వల్లా సర్వం కోలిపోయిన సంఘటన చాలా తక్కువ . కారణం రాజధానుల మార్పు ,జిల్లాల మార్పు వంటివి వారికే ముందు తెలుస్తుంది కాబట్టి . 

సుమారు గా లక్ష కోట్ల రూపాయలు  కొత్తగా ఏర్పాటు అయ్యే  రాజధానుల ఖర్చు అనుకుంటే , ఈ డబ్బులు గత ప్రభుత్వాలు కేటాయించడం వల్లా రాష్ట్ర ,మరియు దేశ్ ప్రజల  పైన ఎంత ఆర్ధిక భారం పడుతుంది ? అయిన ప్రజానీకానికి అవసరం కాబట్టి వాటిని బరించినప్పటికీ ,వారి ఇంటిని , నమ్ముకున్నభూమి తల్లిని కోల్పోయి వారి పిల్లల  భవిషత్తు బాగుండాలని కోరుకుంటే ?. 

స్వప్రజాయనమే ముఖ్యం అంటూ ,తాజదానిని మారుస్తాం అంటూ ,ప్రజల మనోభావాలను దెబ్బతియ్యటమే కాకుండా ,రాజధానుల దీక్షను హేళనగా చూడటం ఎంతవరకు సబబు ?.  అమరావతి వంటి రాజధాని పై ఇన్వెస్ట్ మెంట్  పెట్టినటువంటి ప్రభుత్వ ,ప్రైవేట్ యాజమాన్యాల భవిషత్తు ఎక్కడ ?

దాధాపుగా లక్ష కోట్ల రూపాయల ఖర్చును స్వతహాగా సీఎం గారు భరిస్తారా ?లేక ప్రజల పై భారం వేస్తారా ? జవాబు ఎవ్వరు చెప్పాలి ? వంద రోజుల దీక్ష, జగన్ గారి కంటికి కనపడుట లేదా ,కనపడ్డా ? కనపడనట్టుగా నటిస్తున్నారా ? 

దాదాపుగా లక్ష కోట్ల రూపాయల నష్టం ఎలా సమకూర్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ,ఇది ప్రజల సొమ్ము కాదా ? కేవలం సీఎం యొక్క సొమ్మా ?ఎంత మంది కష్టం వృధా అవుతుంది మరి?ఎన్నికోట్ల రూపాయలు వృధా అవుతాయి . అయితే కానీ ,నాయకుల సొత్తు కాదు కదా ? అందుకే వారసత్వ రాజకీయాలకు ,ప్రజా సొమ్మును దిగ మింగే ఈ స్వార్థ నాయకులను ఇంటికి పంపించే కాలం రావాలి ,వారికి పూర్తిగా రాజకీయా జీవితానికి అంతిమా చర్మ గీతం పాడాలి !

సీఎం లు మామూలు జన జీవనం గడిపే వరకు ఇంతే !

Thursday, September 10, 2020

           
          దారి తప్పిన(రాజకీయా)ఉదారత 

దేశం కోసం వారి ప్రాణాలు కూడా లెక్క చెయ్యని రాజులు ,రాణులు  మరియు సాధారణ వ్యక్తులు  ఎంతో మంది వారి ప్రాణాల త్యాగ ఫలమే ,ఈ నాటి స్వాతంత్రం  . దానికి ఒక అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ,సుభాష్ చంద్ర బోస్ వంటి ఎంతో మంది పుణ్య పురుషుల త్యాగబలం  
వల్లా ,ఇది సాధ్యం అయింది. కానీ వీరి యొక్క వారసులు రాజకీయాలలో ఎవ్వరు లేరు ,ఎందుకు ?
వారసులు లేకనా? రాలేకనా? వారికీ రాజకీయాల పై  ఇష్టం లేక మాత్రమే ..... 
ఇక్కడే మొదటి తప్పు జరిగింది ,అది  ఎందరో త్యాగ ధనుల ప్రాణాల ,కష్టాల ఫలం వృధా అవ్వటం మొదలవడం మొదలు పెట్టింది , వారే వారసత్వ రాజకీయాలకు పునాది రాళ్లు ,వేసుంటే  మన దేశం ఇంకోరకంగా ఉండేదేమో ? గాంధీలకు  ,నెహ్రు లకు తేడా ఉందని తెలుసుకొనే వరకు  ఇది ఇలానే కొనసాగుతుంది .   
 కారణం విదేశి వ్యక్తల చేతులలో మన రాజ్యాంగాన్ని,దేశాన్ని ఉంచటమే ఓక పెద్ద తప్పిదం. 
దానికి వివిధ కారణాలు అయినప్పటికీ ,మూల్యం ప్రజల0 చెల్లించుకుంటున్నాం,కానీ ఇప్పటికి మనం ఇంకా పాత తరం రాజకీయాలను పట్టుకొని వేలాడుతుంటే మన బ్రతుకులు ఇంతే , 
అయినా సరే మనం ఇంతే అయితే మన బ్రతుకులతో పాటు , మన పిల్లల బ్రతుకులు కూడా 
ఇంతే ఉంటుంది . అయితే ఇక్కడ ఎప్పుడు రాజకీయాలను విమర్శించుకుంటూ పోతే లాభం 
లేదు అని నా నమ్మకం , మరి మార్పు ఎక్కడ  రావాలి , మనలో మార్పు ముందుగా రావాలి ,
దానికి గాను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి .అవి  

కష్టాన్ని నమ్ముకోవాలి , నిబ్బరంగా ఉండాలి , నాయకున్ని మన మధ్యలోని వారిని  
ఎన్నుకోవాలి, మన నాయకునికి పేదవాని కష్టాలు అన్ని తెలిసి ,అనుభవించిన వాడు కావలి ,
తనకి కారు ,బంగ్లా  వంటి వ్యామోహంలు  ఉండ కూడదు,కానీ కష్టం విలువ తెలిసి ఉండాలి 
మనలో ఒకడు , మన వాడు అవుతాడు కానీ , మనం ఇక్కడ ,తాను పట్నం వాసి అయితే  మనకు లాభం ఏమి ఉండదు . పట్టణానికి మనకు ఎంత దూరమో ,తనకి మనకి కూడా అంతే దూరం పెరుగుతుంది   కదా !

వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి మరి ,అయితే ఒక మెట్టు మనం ముందుకు పోయినట్టుగా 
ఉంటుంది ,తన తాతలు ఏదో చేసారని మనం ఊడిగం చెయ్యాల్సిన అవసరం లేదు ,  ఉదాహరణకు : ఈ మధ్య సర్పంచ్ పదవులకు ,వారి కారిక్రమాలకు వారి వారి భర్తలు హాజరు అవడం జరుగుతుందని ,ప్రజా గ్రామా సభలో వారి వారి భర్తలను ప్రజలను నిలతీయ్యటం జరిగింది , అయితే ఇది ఒకందుకు మంచిదే కానీ , ఈ నిలతీయ్యటం అనేది ఒక రోజు  అంటూ   ఆగిపోకూడదు ,ఇది ఇలా క్రింది స్థాయి నుండి పై స్థాయి కి విస్తరించాలి , ప్రతి ప్రజా నాయకుడు 
అందరికి అందుబాటులో ఉండి తీరాలి , ఇది కదా న్యాయం . 

ప్రజా నాయకులూ సాధారణ జన జీవనం గడపలేరా , లేక పోతే ఎందుకు జరిగింది ఆలా ఏమి 
చేసారని ఇంత గట్టి భద్రత , దానికి అయ్యే ఖర్చు ఎవ్వరు భరించాలి మరి ? ఎంత భరించాలి మనం ? ప్రతి రాజకీయా నాయకుడికి శత్రువులు ఉంటారా ? ఉంటె దేనివల్ల వారికి శత్రువులు 
ఉన్నారని ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అయితే  మాజీ పాత తరం  ప్రజా  నాయకులకు ఇప్పటికి కనీస సౌకర్యాలు లేవని  ఎంత మందికి తెలిసు ? కనీసం స్వంత ఇల్లు ,కారు  వంటివి  వారికి ఇప్పటికి లేవని తెలుసుకోవాలి ?   వారు కేవలం వారికి వచ్చే పెన్షన్ మీదనే 
ఆధార పడి జీవిస్తున్నారు ! వారిని చూసి నేర్చుకోరా ? మరి మన నాయకులూ !
అయ్యో ఎన్నిమార్లు పోటీచేసిన ఓటమి చెందాడని ,మనం(జాలితో ) ఓటు వేస్తే వారు మన నెత్తిన 
కూర్చుంటారు , సాధారణ వ్యక్తి ఉన్నజాలి,కరుణ  ప్రభుత్వ ఉద్యోగికి గాని , ప్రజా నాయకునికి గాని 
ఉండవని గమనించాలి , మనం ఓటు వేసి గెలిచినా నాయకుడు మనల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని మన ఆలోచన ,కానీ తాను మన నెత్తిన కూర్చుంటాడని మనకు తెలియదు కదా !
తెలిసిన , మారక పోతాడా ? అని ఆశా ? కానీ ఎండమావి ఎప్పడికి ,చల్లటి నీటిని ఇవ్వలేదని తెలుసుకో లేక పోతున్నాం కదా !





Tuesday, December 7, 2010

రాజులు మారిన రాజ్యాలు మారవు

రాజులు మారిన రాజ్యాలు మారవు
రాజకియ్యం ఓకే వారసత్వం అయ్యింది ఈ రోజులల్లో , ఓకే కుటుంబంలో ఒక్కడు మన్చి వాడు ఐయినంత మాత్రాన కుటుంబ సబ్యులు కూడా మన్చి వారు కావాలని చట్టం లేదుకదా , కాబట్టి వారసత్వ రాజకియ్యలు కాకుండా ప్రజాలు ఎన్నుకో బడిన ప్రజా రాజ్యం కావాలి నేడు ,కాని ఒక్క సారా బొట్టుకు , పచ్చ నోటుకు అమ్ముడుపోయే దుర్మార్గమైన అలవాటు ఉన్నంత వరకు ఈ ఇబ్బందులు పడాల్సిందే .
రాజకియ్య నీలినీడలు ఉండొద్దు అంటే నిజాయితి ఉండాలి , ఒక మామూలు వ్యక్తి ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పు ను ముక్కు పిండి లేదా బజారుకు ఈడ్చి మరి వాసులు చేస్తారు ,అదే రాజకియ్య నాయకులు ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పును అధికారులు మాత్రం వాసులు చెయ్యలేకే పోతున్నారు . కారణం చట్టం వారికి ఒక చుట్టం కాబట్టి , ఒక రూ$1000/- అప్పుకు ఒక రైతు ఆత్మ హత్యా చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు ఎన్ని అత్యలు చేసుకోవాలి .
దేశంలో ఉన్న నల్ల ధనంను బైటకు తీస్తే దేశం మొత్తం ఒక సంపన్న దేశం ఆతుంది అన్నది ఒక నగ్న సత్యం ,ఈ విషయం ప్రబుత్వానికి కూడా తెలుసు కాని ఏమి చెయ్యలేని వారసత్వ లక్షనమ్ కబాటి తన చేతకాని తనాన్ని పేదవారి పైన చూపిస్తున్నది .దీన్ని ఎవరు కాదనే విషయం .
చట్టానికి హక్కులు లేవమరి ,లేవనే చెప్పాలి కాబోలు ,అటువంటప్పుడు చట్టం లేదనే చెప్పాలి మరి . ఇన్ని ఖర్చులు దండగ ఏ ప్రబుత్వ కార్యలల్లో చుసిన అవినీతి పరుల చిట్టా మాత్రేమే ఉంది ,వీరిని మాత్రం ఏమి చెయ్యలేము అటు ప్రబుత్వం ఇటు మనము,."కొత్త సీసాలో పాత సారాయి"లాగ .(?).

Monday, December 6, 2010

యుగాంతం

యుగాంతం
సూర్య,చంద్ర్హులు ఉన్నంత వరకు నీ ఖ్యాతి విరాజిల్లుతుంది ,అంటూ త్రేతా యుగంలో రాముడు , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు ,అటు అన్జనేయునితో ,ఇటు ధర్మరాజుతో అన్న మాటలు ఎవ్వరు మరువరు .
" పుట్టిన వాడు గిట్టక మానదు " అని కొన్ని వందల సంవ్చారాలకు ముందే శ్రీ కృష్ణుడు తన "గీత" లో తెలియచేసాడు . కాబట్టి ప్రతి వస్తువు ,ప్రాణి ,తప్పక అంతరిస్తుందని అర్థమౌతుంది .
భూమి ఆవిర్భావానికి ముందు పెద్ద గోళంగా ఉన్న సూర్యుడు యొక్క విస్పోటనం వల్ల మిలియన్ సంవ్చారాలకు
చల్లబడి ఏర్పడ్డ గ్రహాలూ 9 గా గుర్తించి దానికి అధిపతిగా సూర్యుడు మధ్యస్తంగా ఉంటూ వీటిని కొనసాగిస్తున్నాడు ,ఇయితే భూమి చల్లబడిన తర్వాత మొట్ట మొదటి ప్రాణి నీటి నుండి ఉద్బవంచిన ఏక కణ జీవిగా మన రసాయన ,బౌతిక శాస్త్రాలు తెలియ బర్స్తున్నాయి .
తర్వాత క్రమంలో దినోసార్లూ,వివిధ రకాల మృగాలు వాటి జీవానాన్ని కొనసాగిస్తూ ఉండగా ఉల్కా పాతం వల్ల అవి అంతరించాయి , ఐయితే తర్వాత మార్పులో గొరిల్ల ,కోతి నుండి క్రమంగా మార్పులు జరుగుతూ ,మానవా రూపాంతరం మొదలు అయ్యాయి .
తర్వాత ఆహార శోదనలు మూలంగా , వేటాడడం జరిగి , లింగ భేదం నుండి వర్గ పోరాటం వరకు దారి తీసింది ,ఈ క్రమమును మనం "రాతియుగంగా "పిలుచుకుంటున్నాము .
ఈ మార్పు భావిష్య్యత్తులో మానవుని ఉనికిని పాటపంచలుచేస్తుంది , అన్న విషయం మర్చి పోయి , అభివృద్ధికి గౌరవంగా విర్రవీగడం జరిగి,నివాసాలు,కుటుంబాలు ,ప్రాంతభేదాలు వంటివి మనిషి మస్తిష్కంలో మొదలు,ఆధిపత్యానికి దారి తీసింది .
ఖండాన్తారాలు గా మానవ జాతి విస్తరించటం మూలంగా దేశాలుగా విడిపోయి .
అప్పటి పరిస్థులకు ఒక ప్రాంతంకు ఆది నాయకుడి హస్తంలో ఆ ప్రాంత జీవులు భద్రతభావాన్ని పొందాయి .
రాజులు ,దేశాలంటూ కొత్త ఏర్పాటు రాజ్యాలుగా వెలసిల్లాయి అని చెరిత్ర చెబుతున్న సత్యాలు ,రాముడి యుగం త్రేతా యుగం ,కృష్ణుడి యుగం ద్వాపర యుగం ,యుగాలు చెప్పిన సత్యాలు .
కొన్ని మిలియను సం:లకు ముందు మానవ జాతిని కాపాడి ప్రకృతి తన శాసనాన్ని నిలబెట్టి ,చివరకు అది తన శాసనాన్ని మానవ జాతికి అందించి ,తర్వాత కాలంలో మనిషి కలుషిత స్వభావంతో ,కుళ్ళు,కుతంత్రాలు,ఆశ పూర్వాకంగా "తెలివి" అభివృద్ధి పరుచుకున్తున్నాని ,భ్రమతో మానవత్వం మరిచి రాతి యుగంలో మానవుడు కృరముగాలతో పోరాడడానికి వినియోగించినా ఆయుధాలు,నేడు మనిషి నుండి మనిషి తనకు తానుగా రక్షణ కోసం ఆయుధాలు ధరించి ప్రజా జీవితంలో మృగంగా జీవించడం నిజంగా విచారించ తగ్గ విషయం .
యిల ఐయితే మనకు మిగిలేది ఒత్తి మట్టి దిబ్బలు మాత్రమె , కారణం కాలం ఎన్నటికైనా జీవులను శాసించే స్థాయిలోనే ఉంది,ఉంటుంది.కృత్తిమ వర్షాలు ,మానవ సంబంధాలు ,కృత్తిమ వంగడాలు వాతావరణాలు మొదలైనవి మానవ జీవితాలను ప్రభావితం చెయ్యడం అనేది తప్పని పరస్థితి .
యుగాంతం అనగానే ఏదో భూమి ముక్కలు,ముక్కలుగా విడిపోయి కుంచించుక పోవడమే అని అభిప్రాయం మాత్రం కల్గి ఉన్నారు , కాని పంచభూతాలు వల్ల వచ్చే విపత్తు వల్ల కూడా వచ్చే వైపల్యాలు కూడా యుగాంతం ఒక భాగమే , గాలి వల్ల సైన్ప్లూ ,నీటి వల్ల సునామి ,అతిసార అగ్ని ప్రమాదాలు,అగ్ని పర్వతాలు విస్పోటనం ,అధిక వేడి ,భూ కంపాలు ,ధ్వని కాలుష్యం వల్ల వచ్చే అనర్ధాలు ఎన్నో ఉన్నాయి .ప్రకృతి మనకి కావలిసినా హిమాలయాలు,ఊటి,ఆశ్రామాలు ,వంటి ప్రకృతి సిద్ధ వాతావారణ ప్రాంతాలను కల్పించాడు.కాబాట్టి పర్యావరణ వేత్తలు చెప్పి నట్టుగా ఉంట్టే మానవ మనుగడను మరి కొంచం కాలం సాగించా వచ్చు , అంతే కాని విధి రాతను మార్చే అవకాశం లేదు.
౧) నీటిని అమ్మబడును
౨)అమ్మ తత్వాన్ని అమ్మబడును
౩)చదువును "
౪)రక్తంను "
౫)రక్త బంధాన్ని "
౬)దేశాన్ని తాకట్టు పెట్ట బడును
౭)వావి వరుసలు మరిచి ప్రవర్తించటం జరుగును ౮)కేవలం యంత్రాలను మాత్రేమే నామమును ఈదే భావిశ్శత్తు .